యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రస్తుతం 150కోట్ల ఫీవర్ పట్టుకుందని టాలీవుడ్ లో సెటైర్లు పడుతున్నాయి. ‘ఆవారా’' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ఆదరణ పొందిన తమిళ దర్శకుడు లింగుస్వామి సినిమాలకు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. ఈ దర్శకుడు తీస్తున్న లేటెస్ట్ సినిమా"అంజాన్" ఈ సారి ఏకంగా జూనియర్ నటించిన ‘రభస’ తో పోటీ పడుతూ ఆగష్టు 15న విడుదల కావడానికి అన్నిఏర్పాట్లు ఇప్పటినుంచే చేసుకుంటోంది. సూర్యా హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఒకేసారి తెలుగు తమిళ హిందీ భాషలలో విడుదల కాబోతూ ఉండటంతో ఈ సినిమా15౦ కోట్ల క్లబ్ లో చేరుతుందని ఈ సినిమా దర్శక నిర్మాతలు చాల గట్టినమ్మకం పై ఉన్నారు. అంతే కాదు ఈ సినిమా పబ్లిసిటీ అత్యంత భారీ స్థాయిలో జూలై మధ్య నుండి మొదలు పెట్టబోతున్నారని కోలీవుడ్ మీడియా టాక్. ఈ వార్తలు అన్ని జూనియర్ కు తెగ టెన్షన్ తెప్పిస్తున్నాయని టాక్. దీనికి కారణం జూనియర్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘రభస’ సినిమా కుడా ఇదే సమయానికి విడుదల కాబోతోంది. ఇంకా రభస సినిమా షూటింగ్ పూర్తి కాకుండా జూనియర్ కు తలనొప్పిగా మారుతూ ఉంటే "అంజాన్"యూనిట్ మాత్రం తమ సినిమాకు సంభందించి పక్క పబ్లిసిటీ ప్రణాళికతో టాలీవుడ్ లో కుడా విడుదల చేయబోతు ఉండడం యంగ్ టైగర్ కు చెమటలు పట్టిస్తోంది అని అంటున్నారు.  ఇంతవరకు వచ్చిన తన సినిమా లు 50 కోట్ల టార్గెట్ ను కుడా ఇప్పటివరకు అందుకొలేని పరిస్థితులలో ఏకంగా 15౦కోట్ల టార్గెట్ సినిమాను ఎలా ఎదుర్కొవాలి అంటూ ఇప్పటినుంచే జూనియర్ ఆలోచిస్తున్నాడు అని టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: