ఈరోజు దేశమంతా అన్నాచెల్లెళ్ళ – అక్కాతమ్ముళ్ల బంధానికి ప్రతీకగా జరుపుకుంటున్న రక్షాబంధన వేడుకలు ఈసారి మరింత ఘనంగా పూరి జగన్నాద్ కొత్త ఇల్లు ‘కేవ్’ లో జరగబోతున్నాయి. ఈ సంధర్భంగా మీడియాతో మాట్లాడిన పూరి పిల్లలు కొన్ని ఆ శక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. తన ధైర్యం తన చెల్లెలే అంటున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్. కంటికి రెప్పలా కాపాడుకునే అన్నంటే తనకు ప్రాణం అంటోంది పూరీ తనయ పవిత్ర. ఆకాశ్ ఇంటర్, పవిత్ర టెన్త్ చదువుతున్నారు. తన అన్నయ్యకు సర్‌ప్రైజ్ లు ఇవ్వడం చెల్లి పవిత్రకు సరదా. క్రితం సంవత్సరం కూడ ఆకాశ్ బర్త్‌డేకి రేర్ ఫొటోగ్రాఫ్స్‌తో ఏవీ ప్రిపేర్ చేసి పవిత్ర తన అన్నకు కానుకగా ఇచ్చిందట  అయితే వారిద్దరిలో చెల్లెలిదే పై చేయి అని అంటున్నాడు ఆకాశ్. ఆకాశ్ కు కోపం వస్తే మాత్రం తన చెల్లి పై బొమ్మలు విసిరేస్తాడట. అయినా చెల్లి పవిత్రకు తన అన్న పై కోపం రాదు సరికదా తన అన్నను ఎవరు ఏమన్నా అసలు ఊరుకోదట. ఫ్యాషన్ డిజైనింగ్ లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్న చెల్లిని ప్రోత్సహించడం అన్నయ్య ఆకాశ్ కు ఇష్టం అని అంటున్నాడు.  ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజున  తాను డిజైన్ చేసిన షర్టులు వేసుకుని తనకు ఇష్టమైన బహుమతులు ఇస్తాడు తన అన్న అని చెపుతోంది పవిత్ర. భవిష్యత్తులో తాను హీరోగా, తన చెల్లి దర్శకురాలిగా మారి టాలీవుడ్ ను షేక్ చేస్తామని చెపుతున్న ఈ అన్నా చెల్లెళ్ళ కోరిక తీరాలని కోరుకుందాం...  

మరింత సమాచారం తెలుసుకోండి: