కోలీవుడ్ హీరో సూర్య ‘అoజాన్’ పంట పండింది అనే వార్తలు వస్తున్నాయి. తెలుగులో ‘సికిందర్’ గా డబ్ చేయబడుతున్న ఈ సినిమా రిలీజ్ కాకుండానే టాలీవుడ్ లో కూడ సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాతో పోటీగా విడుదలయ్యే పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో అటు కోలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను కూడ సూర్య సంచలనాలు చేయడం ఖాయం అని అంటున్నారు.  తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా ఆగస్టు 15న భారీ స్థాయిలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి తమిళనాడుతో పాటు ఆంధ్ర, తెలంగాణల్లో కూడా బిజినెస్‌ బాగా జరిగింది అనే వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో 37 కోట్ల బిజినెస్‌, ఆంధ్ర`తెలంగాణలో 13 కోట్ల బిజినెస్‌ చేసిన ఈ సినిమాకు రెండు భాషలలోను శాటిలైట్‌ రైట్స్‌ రూపంలోనే 19 కోట్లు వచ్చాయి అని టాక్. ఇది ఇలా ఉండగా ఓవర్సీస్ మార్కెట్లో కూడ ఈ సినిమా 10 కోట్ల బిజినెస్ జరిగింది అనే వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న అన్ని వివరాలను బట్టి సూర్య ‘అoజాన్’ ఇప్పటికే 80 కోట్ల బిజినెస్ మార్క్ ను అందుకోవడంతో కలెక్షన్ల పరంగా ఈసినిమా ఎటువంటి సునామి సృష్టిస్తుందో అనే ఆశక్తితో విశ్లేషకులు ఎదురు చూస్తున్నారు.  కోలీవుడ్ లో టాప్ హీరోగా స్థిరపడిపోయిన సూర్య ఈ సినిమా తో అనుకున్న విజయం సాధిస్తే టాలీవుడ్ లో టాప్ హీరోలకు పోటీ ఇవ్వడం ఖాయం అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: