పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కర్నూల్ లో మరో కొత్త అవతారంలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి దాకా టాలీవుడ్ ఎంపరర్ గా, పుస్తకాల ప్రేమికుడిగా, రాజకీయ వేత్తగా అన్నింటా మించి ఒక వేదాంతిలా ప్రవర్తిస్తున్న పవన్ ఈ కొత్త అవతారంలో సమాజానికి ఏమి చెపుతాడు అనే ఆశక్తి అందరిలోనూ కనిపిస్తోంది.

సినిమాలు చాల తక్కువగా చేస్తున్న పవన్ ఈమధ్య తన వ్యవసాయ క్షేత్రంలో ఎక్కువగా వ్యవసాయ కార్యక్రమాల పట్ల ముఖ్యంగా రాసాయనాలకు దూరంగా ఉండే ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతుల పై తన ఆశక్తిని పెంచుకోవడమే కాకుండా ఈ విషయంలో పరిశోధన చేస్తున్న విజయరామ్ తో అనేక విషయాలను ఈ ఆర్గానిక్ వ్యవసాయం గురించి తరుచు చర్చిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు వినపడుతున్న వార్తల ప్రకారం విజయరామ్ కర్నూలులో త్వరలో దాదాపు ౩౦౦౦ మంది వ్యవసాయ దారులకు ఈ ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతుల గురించి తెలియ చెప్పడానికి విజయ రామ్ నిర్వహించబోతున్న ఈ వ్యవసాయ సమ్మేళనానికి అతిధిగా రావడానికి పవన్ అంగీకరించాడు అనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పటి దాకా రాజకీయ సభలలో అప్పుడప్పుడు సినిమా ఫంక్షన్స్ లో మాట్లాడిన పవన్ దేశానికి వెన్నుముక లాంటి వ్యవసాయ రంగం రోజురోజుకు దెబ్బతింటున్న నేటి రోజులలో పవన్ తన మాటల ద్వారా వ్యవసాయ దారులకు ఎటువంటి ధైర్యాన్ని, సలహాలను ఇస్తాడు అనే ఆ శక్తి సర్వత్రా నెలకొని ఉoది..

మరింత సమాచారం తెలుసుకోండి: