టెంపర్’ సినిమా అనుకున్న విజయాన్ని అందుకోలేక పోయినా ఏమాత్రం షాక్ అవ్వకుండా తన సినిమాల హడవిడిని కొనసాగిస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్ కు మరో షాక్ తగిలింది. పూరి జగన్నాథ్ ఇంట్లో చోరి జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.

పూరి నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్ రోడ్ నెం. 31లోని ‘కేవ్’ లో పూరి జగన్నాథ్ కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బెడ్‌రూమ్‌లో ఉన్న అలమరా తాళాలు తీసి బంగారు ఆభరణాలు దొంగిలించినట్లుగా తెలుస్తోంది.

ఈ మేరకు పూరి శుక్రవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు అని వార్తలు వస్తున్నాయి. అలమరాలోని సుమారు రూ.15 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, అరుదైన డిజైన్లు, వజ్రాలు పొదిగిన నెక్లెస్ ఉన్నట్లుగా మీడియా వార్తల కథనం.

ఈమధ్య కాలంలో సెలెబ్రెటీల ఇళ్ళను టార్గెట్ చేస్తూ దొంగ తనాలు విపరీతంగా జరుగుతున్నాయి. దొంగలకు కూడా సెలెబ్రెటీలు వాడే వస్తువులు బంగారు ఆభరణాల పై మోజు పెరిగి పోతోంది అనుకోవాలి. ఈ వార్త ఫిలింనగర్ లో సంచలనంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: