నాగ చైతన్య ఎంతో వ్యూహాత్మకంగా ఆలోచించి ఎంపిక చేసుకున్న తన ‘దోచేయ్’ విడుదల తేది చైతూకు అనుకోని సమస్యగా మారింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొదట్లో ఈ సినిమాను ఏప్రియల్ 17న విడుదల చేద్దామని భావించినా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కి దూరంగా ఉండాలి అన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను ఈనెల 24కు మార్చారు. 

లారెన్స్ ‘గంగ


అయితే అనుకోకుండా ఈ వారం  విడుదలైన ‘ఓకే బంగారం’ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు  ఈ వారం  విడుదల అవుతుంది అనుకున్న లారెన్స్ ‘గంగ’ వచ్చే వారానికి తన విడుదల తేదీని మార్చుకుంది. ఇప్పటికే ఈసినిమా కోలీవుడ్ లో  ‘కాంచన 2’ గా మొన్న శుక్రువారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకోవడంతో మంచి జోష్ మీద ఉన్నాడు లారెన్స్. 


అంతేకాకుండా ఈ సినిమాలో నటించిన తాప్సీ నిత్యామీనన్ ల నటన కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా నచ్చింది  అన్న  వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ సినిమాను ఈ వారం భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘గంగ’ చిత్రంపై ఉన్న పాజిటివ్‌ టాక్ వల్ల ‘దోచేయ్‌’ పై ఎఫెక్ట్‌ బాగా ఉంటుంది అన్న వార్తలు వస్తున్నాయి. ‘గంగ’ బి, సి, సెంటర్లలో  చైతూ ‘దోచేయ్’ కు గట్టిపోటీ ఇస్తుంది అని టాక్. 

బాలకృష్ణ ‘లయన్‌’ మే 1


ఈ పోటీని తట్టుకుని  ‘దోచేయ్‌’  బాగా ఆడాలంటే చాలా అద్భుతంగా ఉండాలి. ప్రస్తుతానికి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ఉన్నా అటు మణిరత్నం ‘ఓకే బంగారం’ ఇటు లారెన్స్ ‘గంగ’ ల మధ్య చైతన్య సినిమా నలిగిపోతుందా అన్న అనుమానాన్ని వ్యక్త పరుస్తున్నారు.  పోనీ ఒక వారం వెనక్కి వెళ్లడానికి లేకుండా విడుదలకు సిద్ధంగా ఉన్న బాలకృష్ణ ‘లయన్‌’ మే 1న రాబోతూ ఉండటంతో చైతన్యకు అనుకోని కష్టాలే వచ్చాయి అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: