రామ్ చరణ్ ఈరోజు ఉదయం తన ట్రూజెట్ విమాన కంపెనీకి సంబంధించిన మీడియా సమావేశంలో పాల్గొంటూ చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన విషయం పై వస్తున్న వార్తలకు తెరదించాడు. చిరంజీవి నటించే 150వ సినిమా సెప్టెంబర్ లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ముఖ్యంగా కథ ఫైనల్ కాకుండా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్ళే పరిస్థితి లేదని క్లారిటీ ఇచ్చాడు. 

అంతేకాదు పూరీజగన్నాథ్ రాసిన స్క్రిప్ట్ ఫస్ట్ ఆఫ్ పూర్తిగా నచ్చిందని అయితే సెకండ్ ఆఫ్ పూరీజగన్నాథ్ ఇంకా పూర్తి చేయవలసి ఉందని ఈకథ పూర్తిగా చిరంజీవికి నచ్చితేనే సెట్స్ పైకి వెళ్తుందని లేదంటే పూరీ సినిమా వెనక్కు వెళ్ళినట్లే అన్న సంకేతాలు అధికారికంగా రామ్ చరణ్ తెలియచేసాడు. 

అదేవిధంగా వినాయక్ కూడ చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి ఒక స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నాడని అందువల్ల చిరంజీవికి పూర్తిగా ఎవరి కథ నచ్చితే ఆ కథను తాను చిరంజీవి 150వ సినిమాగా నిర్మిస్తానని క్లారిటీ ఇచ్చాడు. అదేవిధంగా పవన్ ‘గబ్బర్ సింగ్ 2’ పూర్తి అయిన తరువాత పవన్ కళ్యాణ్ నిర్మాతగా నిర్మించబోయే సినిమాలో తాను హీరోగా నటిస్తానని క్లారిటీ  ఇచ్చాడు చరణ్. 

దీనిని బట్టి చూస్తూ ఉంటే గత కొద్ది కాలంగా మీడియాకు హాట్ టాపిక్ గా మారిన మెగా కుటుంబ విభేదాలు పక్కకు పెట్టి మెగా కుటుంబం అంతా ఒకే త్రాటి పైకి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని అనిపిస్తోంది. బహుశా చిరంజీవి షష్టిపూర్తికి ఈ టోటల్ గ్రూప్ ఫోటో మీడియా కెమెరాలకు చిక్కే ఆస్కారం ఉంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: