తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని.. తనయులు అధికారం చెలాయించడం కామనైపోయింది. ఇక తండ్రి మంత్రయితే.. అధికారులను బెదిరించి పనులు చేయించుకోవడమా సాధారణమైపోయింది. ఆస్తి తగాదాలు, సెటిల్ మెంట్లు, ఫ్యామిలీ వ్యవహారాలు, కాంట్రాక్టులు.. ఇలా ఇష్యూ ఏదైనా సరే.. వీరు తలదూరుస్తుంటారు. తమ మాటే నెగ్గాలని పోరాడుతుంటారు. 

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సంతానంపై కూడా ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. ఇటీవలే ఓ రియల్ ఎస్టేట్ సెటిల్ మెంట్ వ్యవహారంలో తలసాని కుమార్తె జోక్యం చేసుకుందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొడుకు వంతు వచ్చినట్టుంది. తలసాని కొడుకు ఓ ప్రేమజంట వ్యవహారంలో తలదూర్చి వారిని విడదీసినట్టు వార్తలు వస్తున్నాయి. 

సికింద్రాబాద్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న అభినవ్ అనే వ్యక్తి భార్యను బలవంతంగా అమ్మాయి తరపున వాళ్లు కిడ్నాప్ చేశారట. ఈ కిడ్నాప్ వెనుక మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడి హస్తం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి తలసాని కుమారుడి అండతోనే పుట్టింటివారు ఆ అమ్మాయిని తీసుకెళ్లారని అభినవ్ అంటున్నారు. 

అంతేకాదు.. ఈ అభినవ్ అనే వ్యక్తిని మంత్రి కొడుకు చితకబాదించాడట. ఇలాంటి వ్యవహారాల్లో మంత్రి కుమారుడి నేరం రుజువయ్యే అవకాశమే లేదు. అయినా ఇలాంటి వార్తలు తలసాని రాజకీయ భవితవ్యానికి అంత మంచిది కాదని విశ్లేషకులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: