ఈ మద్య కాలంలో మనిషి డబ్బు కోసం అందులోనూ ఈజీ మని కోసం రక రకాల జిమ్మిక్కులు చేస్తున్నాడు. సొసైటీలో లగ్జరీగా బతకడానికి ఈజీగా డబ్బు సంపాదించడానికి తప్పుడు మార్గాలు ఎన్నుకుంటున్నాడు. ఇందులో ముఖ్యంగా హైటె వ్యభిచారం.. కొంత మంది అమ్మాయిల బలహీనతలు క్యాష్ చేసుకొని వారిని ఆటబొమ్మల్లా వాడుకుంటున్నారు. మసాజ్ సెంటర్లని, బ్యూటీ పార్లర్స్ లాంటి ముసుగులో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ విటుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. దేశంలోని ముఖ్యనగరాల్లో ఇలాంటి హైటెక్ వ్యభిచారాలు ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి.

ఆ మద్య హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇలాంటి కేసులు చాలా నమోదైనాయి. అంతే కాదు ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక కేంద్రంగా అభివృద్ది చెందుతున్న విశాఖ పట్నం కేంద్రంగా చేసుకొని ఇలాంటి హైటెక్ వ్యభిచారాలు చాలా జరుగుతున్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు వీటి గుట్టు బయట పెడుతున్నా ఏదో మూలన ఇలాంటి తతంగాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖలో హైటెక్ వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

మసాజ్ ముసుగులో.. హైటెక్ వ్యభిచారం


‘విశాఖ కాల్ గర్ల్స్’ పేరిట ప్రత్యేకంగా ఓ సైట్ ను ప్రధాన నిందితుడు ప్రారంభించాడు. ఈ సైట్ ను హైదరాబాదులో ఉంటూ ఈ ముఠాను నడిపిస్తున్నాడు. తమ సైట్లోకి వచ్చే విటులకు ఆకర్శిస్తూ.. ఆన్ లైన్ లోనే అన్ని వివరాలు అందజేయడంతో పాటు లావాదేవీలను కూడా ఆన్ లైన్ లోనే నిర్వహిస్తున్నాడు. గుట్టుగా సాగుతుందనుకున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు చాలా పకడ్భందీగా ఫాలో చేస్తూ ముఠా గుట్టు రట్టు చేశారు. హైదరాబాదులో ఉంటున్న ప్రధాన నిందితుడితో పాటు, ఈ రాకెట్ కు చెందిన మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: