భారతదేశంలో పుణ్యక్షేత్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న తిరుపతిలో రోజు రోజుకీ అక్రమాలు మితిమీరిపోతున్నాయి. ఇక్కడ ఈజీ మనీకోసం కొంతమంతి అక్రమార్కులు తిరుపతి పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యక్రమాలతో చెలరేగిపోతున్నారు. ఇక కొంతమంది దైవసన్నిథిలో చనిపోతే పుణ్యం వస్తుందని.. కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా తిరుపతిలోని తితిదే సముదాయాలకు అతి సమీపంలో ఉన్న లాడ్జిలలో గత కొంత కాలంగా గుట్టుగా వ్యభిచారం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. తిరుపతిలో దైవ దర్శనం చేసుకోవడానికి వచ్చిన యువకులను తమ వల్లో వేసుకొని వారి వద్దనుంచి అడ్డగోలుగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు ఈ ముఠా సభ్యులు. గత కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్నపోలీసులు లాడ్జీపై దాడి చేశారు.

ఈ దాడిలో తొమ్మిదిమందితో కూడిన ముఠా అతి రహస్యంగా ఈ తతంగాన్ని నడిపిస్తున్న విషయం పోలీసులకు తెలిసింది. ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ముఠాను నిర్వహిస్తున్నది ఒక మహిళా. ఆమెకు సహాయంగా కొంతంది పురుషులు పని చేస్తున్నారు. పైకి ఎంతో భక్తితో పరమ భక్తుల్లా కనిపిస్తూ..విటులను ఆకర్షించేవారు. అంతే కాదు నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన కొంతమంది నిరుద్యోగ యువతులను మభ్యపెట్టి వ్యభిచార కూపంలోకి ఈ మహిళ దింపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

తిరుపతి


కొంతమంది మహిళలు, యువతులు గత్యంతరం లేని పరిస్థితిలో వారిని లొంగతీసుకొని వారిచే వ్యభిచారం నిర్వహిస్తూ బాగా డబ్బులు సంపాదించారు. వ్యభిచార నిర్వాహకురాలు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మహిళ సహాయంతోనే వీరిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.


మరింత సమాచారం తెలుసుకోండి: