ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ జగన్ ప్రస్తుతం గుంటూరులో వైసీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలో ఆయన ఏపిలో పాదయ యాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఇక అక్రమాస్తుల కేసులో విచారణను ఎదుర్కుంటున్న వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలపై ఈ రోజు సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇకపై ఇలాంటివి పునరావృతం కాకూడదని తెలిపారు. ఈ కేసులో ఈ రోజు జగన్తో పాటు విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరుకావల్సి ఉంది. ఇటువంటిది మరోసారి జరిగితే వారెంటు జారీ చేయాల్సి ఉంటుందని తెలిపింది.
ప్రస్తుతం జగన్ గుంటూరులో వైసీపీ ప్లీనరీ సమావేశం నేపథ్యంలో హాజరుకాలేకపోయారని తెలుపుతూ వారి తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.