social smagglers komatlu by kanche ilaiah కోసం చిత్ర ఫలితం


"సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు"..... "కోమటోళ్ళు"  అని ఒక అవహేళన పూరిత వ్యాఖ్య చేయటంతోనే కంచె ఐలయ్య మాష్టారు వ్యక్తిత్వంలోని వికారం, అనాగరికత, అసహ్యత, అసహనం, నిర్లక్ష్యం, దురహంకారం, సమాజంపట్ల ఆయన బాధ్యతారాహిత్యం బయటపడ్డాయి. ఆయనకు అయనగా చెప్పుకునే "సామాజిక శాస్త్రవెత్త" అనే టైటిల్  ఆయనకు  గౌరవాన్ని, ఆపాదించలేదన్నది సుస్పష్టం. "నిశ్చబ్ధం పాటించే ఒకే ఒక సామాజిక వర్గం వైశ్యులు"  తమ వ్యాపారాలు తాము చేసుకుంటూ అటు రాజకీయంగాని పదవీ లాలసగాని ప్రదర్శించని వర్గమిది.

 

కంచె ఐలయ్య మాష్టారు చెప్పుకుంటే తప్ప ఆయన “ప్రొఫెసర్” అని తెలియట్లేదు. ఆయన వాడే బాషలోగాని సమాజం పట్ల ఆయన వ్యక్త పరచే భావనలోగాని ఆయన ప్రవర్తనలో గాని ఒక ఉపాద్యాయునికి ఉండాల్సిన సుగుణాలేవీ కలికానికి కూడా కానరావు. అందునా విశ్రాంత ఉపాద్యాయుడుగా ఎంతో విఙ్జత ప్రదర్శించి సమాజానికి సేవ చేసే పనిలో ఉండాల్సిన ఆయన తనచుట్టూ తాను "కంచె" సృష్టించుకుని  "నూతిలోని కప్పలాగా" ఆధునిక సమాజానికి అంతులేనంత దూరంలో ఉన్నట్లుగా ఉంది.

 

తమ కున్నంతలో వైశ్యులు తమ వంతు సేవలు అనేక విధాలుగా చేస్తూనే ఉన్నారు అదీ ప్రతిఫలాన్ని ఆశించకుండా. ఏనాటి సమాజంలో నైనా , అనాదిగా వైశ్య కులం తనపాత్ర తాను పోషిస్తూనే ఉంది. వ్యవసాయ జాతులకు భూసంపద పశు వ్యవసాయ పరికరాలు ఎలా సంపాదించుకుంటారో, అలాగానే వణిక్ వర్గాలకు తమ సంపదను త్వరగా "లిక్విడ్" గా మార్చుకోవటానికి తగిన విధం అమూల్య ఖనిజ (బంగారం - వెండి)  రూపంలో  నిల్వ చేసుకుంటారు.  వ్యాపారానికి "లిక్విడిటి ప్రాణాధారం" అదే  వారికి "రా-మెటీరియల్" దీన్ని కూడా అర్ధం చేసుకోలేని “ప్రొఫెసర్”  గారి  అర్ధశాస్త్ర పరిఙ్జానికి  విఙ్జానానికి జోహార్లు.

 

ఒక కులాన్ని సామాజికంగా అవహేళన చేస్తే ఆ కులజనం బెదిరించరా?  భయపెట్టరా? సామాజిక బాధ్యత మరచి వాక్-స్వతంత్రం ఉంది కదా!  అని వేరే వారిని వర్గాలను అవహేళణ చేస్తే ఆ సమాజం కూడా అంత కంటే వికారంగా స్పందించటం సహజం. కోమటొళ్ళు స్మగ్లర్లైతే దావూద్ ఇబ్రహిం గాంగ్ సంగతేమిటి? వాళ్ళు దేశ భక్తులా? వాళ్ళని ప్రశ్నించరేమి ఈ మాష్టారు. ఈ మాస్టారు రాసిన ప్రకారం ఆయన హిందూ మతవాదికారట. మతం దేనికీ ప్రామాణికం కాదు. మతం ఒక వ్యక్తి హృదయానికి మహా ఐతే గృహానికి మాత్రమే పరిమితం. అలాంటి సాధారణ పరిజ్ఙ్జనం ఈ మాస్టారికి లేకపోవటం ఆయన విద్యార్ధుల దురదృష్టం. “హిందూ అనేది జీవన విధానం” ఒక మతం కాదు. ఏ మతస్తుడైనా హిందూ జీవన విధానాన్ని తన మతవిధానంతో సంభందం లేకుండా పాటించవచ్చు. అందుకే విదేశాల్లో ఇతర మతస్తులు కూడా హిందూ ఆలయాలని దర్శించుకుంటారు.   

 social smagglers komatlu by kanche ilaiah కోసం చిత్ర ఫలితం

Dalit writer Kancha Ilaiah fears for life after protests erupt against his book


దానికి ఎమైఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా కంచె ఐలయ్యను మందలించటం మరచి ఆయనకు "ప్రాణ భయం" ఉందంటూ రక్షణ కలిపించవలసిందిగా తెలంగాణ ముఖ్యమంత్రికి  పత్రికా ముఖంగా  కోరటం  విడ్డూరం. ఇద్దరూ సామాజిక బాధ్యత విషయములో నిరర్ధకులేనని వారి గత చరిత్రలు చెపుతూనే ఉన్నాయి. "వాక్ స్వతంత్రమంటే ఇతరులకు ఇబ్బంది  కలిగించనిది బాధ పెట్టనిది గా ఉండాలని” బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వేదికగా ప్రవచించారు. ఆ పాటి ఙ్జానం కూడా లేని అరాచక ప్రొఫెసర్ గారికి అర్ధమయ్యే రీతిలో భోదించాలనే బహుశ కొందరు ఘాటుగా  స్పందించి ఉండొచ్చు. ఆ వర్గ సహజగుణం అహింస. ఆయన ప్రాణానికొచ్చిన హానేమీ ఉండదని,  ఆయనకు తెలియబట్టే,  ఆయన ఆ పుస్తకానికి ఆ పేరు పెట్టారు. లేకుంటే వేరే కులాన్ని ఈ విధంగా  అవహేళణాపూరిత స్వరంతో నామకరణం చేయగలరా?  చేస్తే ఈ పాటికే ఆయన క్షమాపణలు చేప్పేవారు అదీ ప్రాణ భయంతో.    

 

సామాజిక బాధ్యత తెలియని కంచె ఐలయ్య లాంటి ఉపాధ్యాయుల వలననే నవ భారత యువత పెడదార్లు పడుతున్నాయి. విశ్వవిద్యాలయాలు విద్యా విఙ్జాన వేదికలు గాకుండా అనవసర రాగ్ధాంతాలకు నిలయాలుగా మారిపోతున్నాయి.” గుడ్డిలో మెల్ల చందం” గా ఐలయ్య విశ్రాంత ఉపాధ్యాయుడయ్యారు. ఆయన గతములో పనిచేసిన విశ్వ విద్యాలయాల్లో కళాశాలల్లో నాటిన అఙ్జాన బీజాలు ఆయనతోనే అంతరించిపోతే మంచిది.  ఏడు పదుల స్వాతంత్రం తరవాత కూడా భారత్ ప్రసాదించిన సామాజిక ప్రయోజనాలను ఒక ప్రక్క రిజర్వేషణ్లు, మరోప్రక్క సామాజిక సంక్షేమ ఫలాలను వివిధ పథకాల క్రింద  తనివితీరా అనుభవిస్తూ జాతికి ఎలాంటి ప్రయోజనమూ అందించని ఈ కంచె ఐలయ్యకు “చీమల్లా అహోరాత్రాలు శ్రమిస్తూ జీవనం సాగించే“ సోకాల్డ్ కోమటోళ్ళ ను నిందించటం తప్ప ఇంకేం తెలుసు.

 

అయితే ఈ విషయం మీద స్పందించిన “క్రిటిక్ మహేష్ కత్తి”  "ఇక్కడ హక్కులు ఉన్నవి దళితులకా? అధికార కులాలకా? అనేది కాదు, "ఫ్రీడం ఆఫ్ ఎక్స్-ప్రెషన్ అనేది ఎవ్వరికైనా ఉంది. కొడతాం! చంపుతాం! అంటూ బెదిరించడం అనేది మూర్ఖపుచర్య. ఆయన రాసింది నచ్చకపోయినా, అభ్యంతరకరంగా ఉన్నా అభ్యంతరం తెలిపే మార్గాలు బోలెడు ఉన్నాయి. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఎవరూ రెచ్చిపోయే పద్ధతి మంచిది కాదు. చట్టం రక్షణ కల్పించిన హక్కుకు హాని కలిగిస్తూ, అది మా హక్కు అని మాత్రం అనకండి" అని త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నాడు.  అయితే "ఫ్రీడం ఆఫ్ ఎక్స్-ప్రెషన్" అనేది ఏ వ్యక్తినీ వర్గాన్ని కించపరచనంతవరకే అన్నది గమనించాలి.అది కంచె ఐలయ్యకు చాలా అవసరమని “ క్రిటిక్ అనబడే” మహేష్ కత్తిగారు గుర్తించి ఆయనగారికే ఒక చురక అంటించి ఉంటే "క్రిటిక్ అనబడే" మాట ఈ రచయిత వాడవలసిన శ్రమ తప్పేది.

social smagglers komatlu by kanche ilaiah కోసం చిత్ర ఫలితం

 

భిన్నత్వం లో ఏకత్వం లాంటి భారత సమాజములో ఇలా బాధ్యతా రహిత ప్రకటనలు చేసే కంచె ఐలయ్య మాస్టారు లాంటి  విద్యాఙ్జాన శూన్యులు, వాగాడంబర ప్రతిభావంతులను క్షమించి వదిలేస్తే మంచిది గాదు. చట్టపరమైన అనేక చర్యలకు ఒకేసారి ఉపక్రమిస్తే మంచిది. ఆ చర్యలే అయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

 

"పూను స్పర్ధలు విద్య లందే వైరములు వాణిజ్య మందే" అని మహనీయులన్నట్లు వైశ్యులు వ్యాపారస్తులు కావటం వలననే వారిలో వ్యాపార విఫణి పరంగా తరతరాలుగా స్పర్ధలు ఉండటం సహజమవటముతో ఐఖ్యత లోపించింది. వారిలో ఐఖ్యత లేకపోవటమే ఈ కంచె ఐలయ్యకు ఇంత బలమిచ్చింది. వేరే ఏ కులాన్ని ఇంతలా అవమానించినా,  ఈ మాష్టారు ఈ పాటికి శంకరగిరిమాన్యాలు పట్టేవారే . “గాంధి గారి ప్రవచించిన అచారాలను పాటిచరు వైశ్యులు”  అన్న ఆయన పలుకులు పూర్తిగా తప్పని ఋజువైంది,  కనుకనే ఆయన ఇంకా మన గలుగుతున్నారు.

 

ఆయన ప్రవచించినట్లు వైశ్యులు స్వీకరించేది సాత్విక ఆహారమే,  కాని ఐలయ్య రోజూ స్వీకరించే అసాధారణ ఆహారం మాత్రం కాదు. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలనే అరిష్డ్వర్గాలను ప్రేరేపించే - ఆలోచను మసకబార్చే,  ఇలాంటి తప్పుడు రచనలు కంచె ఐలయ్య మాస్టారు తప్ప మరెవరు రాయగలరు.

 

“తినే ఆహారం పై కామెంట్ చేయరాదని ఆ హక్కు కోసం అనుక్షణం విశ్వవిద్యాలయాల్లో నెఱపవలసిన విధ్యార్జన అనే ప్రామాణిక అవసరాన్ని వదిలేసి "ఆహారం" అనేదాని పట్టుకుని వారోత్సవాలు, పోరాటాలు, సాగించే ఈ ఐలయ్యకు సాత్విక ఆహారం విలువ ఏమిటో ఎలా తెలుస్తుంది”

 

నరెంద్ర మోడీ అమిత్ షాల కులం ఏదో?  నాకు తెలియదు కాని అంబానీలు లాంటి వారే కాదు సాధారణ వైశ్యులు కూడా మొత్తం ఉద్యోగాల్లో  సుమారు 20% పైగా దేశ వాసులకు ఉద్యోగాలు కల్పిస్తూ వస్తున్నారు. వైశ్యులు ఏదో రకంగా ఉద్యోగాలు కలిపించి కొందరు ప్రజల ఆహార అర్తినైనా తీరుస్తూ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు.

 

ఇంకో విషయం, ఏడు దశాబ్ధాల స్వాతంత్ర భారతం లో ఏ ప్రభుత్వమైనా, ఏనాడైనా చైనాను నిలువరించిందా? ఆ పని అదే చైనా పాకిస్థానులను వణికించే పని మాత్రం ఈ ద్వయం నిర్వహించింది. అదే ఈ ఐలయ్యకు గొంతున పచ్చి వెలక్కాయ పడేసిందనుకుంటా. వాళ్ళిద్దరి కులం కోమటోళ్ళు కావటమే కారణం కావచ్చు ఆయన ఈ విధంగా కోమట్లపై దాడి చెయ్యటం.

 

ఈ ఐలయ్యగారి పార్టీ - చైనా దాడి చేసి భారత్ ను ఆక్రమించటం కోసం 'గోతికాడ నక్కలా' నిరీక్షిస్తుంది. అలా జరిగితే తప్ప ఈ ఐలయ్య పార్టీ అధికారంలోకి రాదని ఈ మాష్టారు లాంటి వాళ్ళందరికి తెలుసు. అంతర్జాతీయంగా కమ్యూనిస్టు పార్టీ కి క్రమంగా నిలువ నీడ కూడా లేకుండా పోతుంది. చైనా సైతం అంతర్జాతీయంగా కాపిటలిస్టుగా ముద్రవేసుకుని కాపిటలిస్ట్గా తాను కొనసాగుతుంది. తన వ్యాపారం దెబ్బ తింటుందని భ్రమసే భారత్ తో యుద్ధం చేయటం ఆత్మహత్యా సదృశమని వెనకడుగు వేసింది. అందుకే ఎక్కడ స్కౄ బిగించాలో అక్కడే మోడీ షా స్కౄ బిగించారు. వారు వైశ్యులైతే ఆ కులం గర్వపడాల్సిందే. ఏ గొప్ప ఐలయ్యల కులమూ చేయని మేలు ఈ దేశానికి చేసినందుకు దేశభక్తులు అంతా కోమట్లను చూసి గర్వపడాల్సిందే.

 

యుద్ధాల గురించి మాట్లాడటం ఈ ఆధునిక కాలానికి పనికి రాదు మష్టారూ! వ్యూహాల గురించి మాట్లాడండి. వైశ్యులు చేసే వ్యాపారం స్మగ్లింగైతే మీరేం పీకుతున్నారు?  కులం సొల్లు వదిలేసి దానిపై పొరాడండి.  వ్యాపారం కోమటొళ్ళే చేయట్లేదు. కోమట్లు మాత్రమే వ్యాపారులు కాదు. వ్యాపారులంతా కోమటోళ్ళే. మీరన్నట్లు వ్యాపారులంతా స్మగ్లర్లా! ఏ అడవిలో పుట్టారండీ మీరు. ఆటవిక సమాజం నాటి అలోచనలు భావాల నుండి బయటపడండి మాస్టారూ!  అప్పుడు మీరు చరితార్ధులౌతారు. అంతవరకు మీరు చరిత్రహీనులె.

 

నిజమెంతో అబద్దమెంతో తెలియదు గాని కంచె ఐలయ్య మాస్టారుపై బహువిధాలుగా ట్రెండింగ్ అవుతున్న నెట్ పోష్టింగ్ జతపరుస్తున్నాను అదికూడా మాస్టారు లీలలకు ఉదాహరణ. 


social smagglers komatlu by kanche ilaiah కోసం చిత్ర ఫలితం

 

కంచె ఐలయ్య -- పెన్ను పట్టుకున్న ఉగ్రవాది


 కంచ ఐలయ్య గురించి తెలియని ఘోరమైన నిజాలు...!

 దళితులు మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తాడు, కానీ ప్రేమ నిజానికి దళితులు మీద కాదు, దేశాన్ని, దేశ ప్రజలని విడగొట్టాలని ప్లాన్.. అందుకే అభ్యుదయ వాది అని ఒక ముసుగు వేసుకున్నాడు..! 

 ఆయన హిందూ ద్వేషి, క్రీస్టియన్ సానుభూతి పరుడు. అంతే  కాక  దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన, లేదా పాల్పడిన వారికి సహకరించిన వ్యక్తి. 

 ఇతన్ని వెనుక ఉండి నడిపిస్తున్నవి  విదేశీ మిషనరీలు.. వీడికి కోట్ల రూపాయలు నిధులు అందజేస్తున్నాయి..! వీడి పేరు వెనుక షెపర్డ్ అని పేరు పెట్టుకుంది అందుకే..!

 

కంచ ఐలయ్య  లక్ష్యం -- దేశ ప్రజల్లో హిందూ మతం పై అసహ్యం కలగాలి


అందుకే కంచ ఐలయ్య  హిందువుల కులాలపై పుస్తకాలు రాస్తూ, ప్రజల్లోకి విషాన్ని ఎక్కిస్తున్నాడు! విశ్వసనీయ సమాచారం ప్రకారం, వీడు ఎప్పుడో మతం మారిపోయాడు..

అతను రాసిన పుస్తాకాల పేర్లు చూస్తే చాలు ఈ విషయం అర్దమవుతుంది. “Why I am not a Hindu?” (నేను హిందువును ఎందుకు కాను?) ఈ పుస్తకాన్ని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వాళ్ళు స్పాన్సర్ చేసారు),  “Post-Hindu India” (హిందూ మతం పూర్తిగా నాశనం అయిన తరువాతి భారత దేశం). 

అంతే కాక కంచ ఐలయ్య గారు సంస్కృతాన్ని కూడా ద్వేషిస్తారు. 2001 లో “ఇండియాస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్” కి సమర్పించిన నివేదికలో,  “మేము ఈ దేశంలో సంస్కృతాన్ని పూర్తిగా చంపెయ్యాలి అనుకున్నాం”  అని చెప్పారు.

 "క్రీస్టియన్ టుడే"  అనే పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈయన హిందూ ధర్మాన్ని నాజీయిజంతో పోల్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం నాజీయిజం వలన చనిపోయిన యూదుల సంఖ్య  60 లక్షల పైనే. మరి హిందువులని ఆయన వాళ్ళతో ఎలా పోల్చారో ఆయనకే తెలియాలి.


 కంచ ఐలయ్య టార్గెట్ -- ఈ దేశాన్ని క్రైస్తవ మతం తో నింపాలి!


అఖిల భారత క్రీస్టియన్ సమాఖ్య  (All India Christian Council)  కి ఆయన సలహాదారు.

 ”గోస్పెల్ ఫర్ ఆసియా”  లాంటి క్రీస్టియన్ సంస్థలు కంచ ఐలయ్య విదేశీ పర్యటనలని నిర్వహిస్తాయి.

 తన “పోస్ట్ – హిందూ ఇండియా” పుస్తకంలో బుద్ధుడి కన్నా యేసు క్రీస్తే మెరుగని దళితులు భావిస్తున్నారు అని రాసారు. దళితుల్ని క్రైస్తవ మతం పుచ్చుకునేలా ప్రభావితం చేస్తాడు.. అంబేద్కర్ వాది అంటాడు, కానీ బౌద్ధం మాత్రం స్వీకరించడు, అటు వైపు ఎవరిని ప్రోత్సహించడు

కంచ ఐలయ్య  “అఖిల భారత క్రీస్టియన్” సమాఖ్య, “దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్” లాంటి సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తి. “దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్” అమెరికాలోని “డెన్వర్, కొలరాడో”  కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. దీని వ్యవస్తాప అధ్యక్షులు జోసెఫ్ డిసౌజా. డిసౌజా గారు “అఖిల భారత క్రీస్టియన్ సమాఖ్య” కి కూడా అధ్యక్షులుగా చేసారు. 

 

 కంచ ఐలయ్య  దేశ ద్రోహి కార్యకలాపాలు :


“దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్” వారు “"Racism and Caste Based Discrimination in India: Implications for the US-India Relationship” పేరిట, అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల కొరకు, అమెరికాలోని వాషింగ్టన్ లో ఒక సమావేశం నిర్వహించారు.  ఆయన ఈ సమావేశంలో ఒక ప్రముఖ ప్రసంగీకులు. ఈ సమావేశ ముఖ్య లక్ష్యం అమెరికా చేత మన దేశం మీద ఆంక్షలు విధింప చెయ్యడం.

“అఖిల భారత క్రిస్టియన్ సమాఖ్య” వారు అందించిన సమాచారాన్ని ఆధారం చేసుకొని 1998 లో అప్పటి అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఎడోల్ఫస్ టౌన్స్ (Edolphus Towns), భారత దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించి, మన దేశం మీద అమెరికా ఆక్షలు విధించాలి అని డిమాండ్ చేసాడు.

 (సోర్స్: శ్రీ Rajiv Malhotra గారి బ్రేకింగ్ ఇండియా పుస్తకం)

మరింత సమాచారం తెలుసుకోండి: