ఎన్నికల సమయం వస్తే చాలు.. సర్వేలకూ, జ్యోతిష్యులకూ పండగే. వచ్చే ఎన్నికల్లో వీరు గెలుస్తారు.. వారు గెలుస్తారు అంటూ అనేక మీడియా సంస్థలు సర్వేలు చేయించి ఆ ఫలితాలను జనం మీదకు వదులుతూ ఉంటాయి. మళ్లీ ఈ సర్వేలు మూడు నెలలకోసారి చేస్తూ ఊరిస్తుంటాయి. ఇక జ్యోతిష్యులైతే.. ఆయా పార్టీ నాయకుల జాతక చక్రాలు పట్టుకుని తెగ రీసెర్చ్ చేస్తారు.. ఫలానా ఫలానా కారణాల వల్ల వీళ్లదే అధికారం అంటూ చెప్పుకొస్తారు. 

2019 elections andhra pradesh కోసం చిత్ర ఫలితం
ఇలాంటి సర్వేలు, జ్యోతిష్యాలు చాలా వరకూ తమ అంచనాలు తప్పుతూనే ఉంటాయి. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న ఆసక్తితోనూ జనం వీటిని ఫాలో అవుతుంటారు. అవి చర్చనీయాంశాలవుతాయి. వీటిలోనూ కొన్నింటిని విశ్వసనీయత ఉంటుంది. సర్వేల్లో ఆంధ్రా ఆక్టోపస్ గా పేరున్న లగడపాటి రాజగోపాల్ సర్వేలకు మంచి ఆదరణ ఉంది. ఆయన చెప్పింది ఇప్పటివరకూ తప్పలేదు మరి. 


మొన్నటివరకూ ఏపీలో చంద్రబాబుకే మళ్లీ అనుకూలం అంటూ సర్వేలు వచ్చేవి.. కానీ ఇప్పుడు సీన్ మారుతున్నట్టు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న రిపబ్లిక్ టీవీ ఏపీలో జగన్ దే పైచేయి అని ఫలితాలు ప్రకటించింది. ఇప్పుడు ఓ జ్యోతిష్యుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీదే అధికారం అంటూ ఢంకా భజాయిస్తున్నాడు. పోటీపోటీ కాదు జగన్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నాడు. 


తాజాగా.. అహ్మద్ రహీముల్లా ఖాన్ ముస్లిం జ్యోతిష్యుడు ప్రెస్ మీట్ పెట్టి తన అంచనాలను వివరించారు. వైసీపీకి వచ్చే ఎన్నకల్లో 100 కు పైగా సీట్లొస్తాయట. టీడీపీకి  60కు మించి సీట్లు రావట. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమీ ఉండదట. తెలంగాణాలో మళ్ళీ కేసీఆర్ గెలుపు ఖాయమట. ఒక్క పాతబస్తీ తప్ప మిగతా లోక్‌సభ సీట్లన్నీ టీఆర్ఎస్ ఖాతాలోకే వెళ్లిపోతాయట. ఇక కేంద్రంలో హోరాహోరీ పోరులో మోడీయే గెలుస్తారట. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందట. ఇవీ రహీముల్లాఖాన్ భవిష్యవాణి. ఇప్పటివరకూ తాను చెప్పిందేదీ జరగకుండా పోలేదట.. మరి ఈసారి ఎంతవరకూ నిజమవుతుందో..



మరింత సమాచారం తెలుసుకోండి: