'బైపాస్‌ రోడ్డులో తెలంగాణ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈశ్వర్ డ్రైవర్ కారులో డీజిల్ పోయించుకునేందుకు తీసుకెళ్లిన సమయంలో వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టింది.  ప్రమాదానికి కారణమైన వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, చీఫ్‌ విప్‌ను వేరే వాహనంలో తరలించారు. ప్రమాద సంఘటన సమాచారం తెలుసుకున్న పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ఈశ్వర్‌ను ఫోన్‌ చేసి క్షేమ సమాచారాలు కనుక్కుంటున్నారు. కాగా,  గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే వరంగల్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు.
Road accident on karimnagar bypass road one died - Sakshi
మృతుడు గోపాల్....తన కుమారుని వివాహ పత్రికలను వేములవాడ ఆలయంలో ఇచ్చేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: