రాష్ట్రం నుంచి రాజ్యసభకు జరగాల్సిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఏపీలో జరగాల్సిన మూడు రాజ్యసభ స్థానాలకు గానూ నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం మూడు సీట్లకు ముగ్గురే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో పోటీ లేదని తేలిపోయింది.  కాగా, టీడీపీ రెండు సీట్లకు, వైసీసీ ఒక సీటుకు నామినేషన్లు దాఖలు చేశాయి.

వైసీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి డమ్మీ అభ్యర్థిగా ఆయన సతీమణి ప్రశాంతి కూడా నామినేషన్‌ వేశారు. ప్రభాకరరెడ్డి నామినేషన్‌ సక్రమంగా ఉంటే ఆమె తన అభ్యర్థిత్వం ఉపసంహరించుకుంటారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ తరఫున బుధవారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన సమర్పించారు.
Image result for వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ
ఆయనకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అల్లా రామకృష్ణారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: