ఏపీ కి ప్రత్యేక హోదా కల్పించాలని ఇప్పుడు అన్ని పార్టీలో పోరాడుతున్నాయి.  తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి మాట్లాడుతూ.. చంద్రబాబు ఢిల్లీకి వచ్చి పోరాడాలని అన్నారు. అవిశ్వాసంపై చర్చ జరిగేలా ప్రయత్నాలు చేయాలన్నారు.  అవిశ్వాసంపై చర్చకు కేంద్రం భయపడుతుంది. మెజార్టీ ఉన్న మోడీ ఎందుకు భయపడుతున్నారు.  కేంద్రంపై ఏపీ సర్కార్ న్యాయ పోరాటం చేయాలి..చేసే సమయం వచ్చిందని అన్నారు. 
Image result for ap special status
లోక్ సభలో ఆందోళన చేస్తున్న వారిని సస్పెండ్ చేసిన చర్చ చేపట్టాలి.  చంద్రబాబు ఏమార్చడంలో నెంబర్ వన్..ఏరు దాటాక తెప్ప తగలేసే రకం అని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పడం మానేసి..అవిశ్వాసంపై చర్చ జరిగేలా స్పీకర్ చొరవ చూపించేలా పోరాడాలని అన్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి జరిగి నష్టానికంతా మీరే కారణం.
Image result for undavalli arun kumar
మీరు వాళ్లమీద..వీళ్ల మీద ఎంత తోసినా..ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు..ఈ రోజు తెరపైకి వచ్చి అన్యాయం జరుగుతుందని ప్రజలు  గగ్గోలు పెడితే..దానికి కారణం మీరే అవుతారని అన్నారు. మీరు ఎన్డీయేలో భాగస్వామి.. మీ మంత్రులు అక్కడున్నారు..వాల్ల మంత్రులు ఇక్కడున్నారు.
Image result for bjp tdp                                                                                                           నాలుగేళ్లు అన్యాయం జరుగుతుందని..తెలిసి కూడా మీరు మాట్లాడకపోవడం కేవలం మీ రాజకీ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారనడానికి నిదర్శనం అని అన్నారు.  ఈ తొమ్మిది నెలల్లో కేంద్రంతో పోట్టాడి ప్రజలతో మమేకం అవుతూ..సీన్ మార్చే కెపాసిటీ మీకు ఉంది..మీకు ఆ సమర్థత ఉంది..అది వాడమని మేం కోరుతున్నామని ఉండవల్లి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: