గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో వివాహబంధానికి మచ్చతెచ్చేలా కొంతమంది వివాహితలు ప్రవర్తిస్తున్న తీరు భయాందోళనకు గురి చేస్తుంది. అగ్ని సాక్షిగా  మూడుముళ్ల బంధంతో ఒక్కటైన జంట..తర్వాత కొన్ని కారణాల వల్ల దూరం అవుతున్నారు.  ఈ క్రమంలోనే భర్తకు భారపై అనుమానం..భార్యకు భర్తపై అనుమానం చివరకు అవి ప్రాణాలు తీసే పరిస్థితికి దారి తీస్తున్నాయి.  ఇదిలా ఉంటే..వివాహేత‌ర సంబంధాలు పెట్టుకొని భ‌ర్త అడ్డొస్తున్నాడ‌నే క్రూర‌మైన ఆలోచ‌న‌లతో భార్య‌లు భ‌ర్త‌ల్ని అత్యంత దారుణంగా కిరాత‌కంగా హ‌త‌మారుస్తున్నారు. 

ఆ మద్య తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త అడ్డు తొలగించుకోవాలని నిద్ర‌పోతున్న మంచం కింద బాంబు పెట్టి హ‌త‌మార్చింది. మ‌రోభార్య పెళ్లైన వారం రోజుల‌కే క‌ట్టుకున్న భ‌ర్త‌తో సంసారం చేయ‌డం ఇష్టంలేని ఓ కిలాడి క‌ట్టుకున్న భ‌ర్త‌ను హ‌త్య చేయాలంటూ సుపారీ ఇచ్చింది.  ఇలా ఎన్నో ఉదంతాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి.  ఈ నేప‌థ్యంలో మగాళ్ల బాధలు, మగాళ్ల రక్షణపై ఇన్నాళ్లకు ఓ డిమాండ్ వచ్చింది.. మహిళా కమిషన్ ఉన్నట్లే.. పురుషుల రక్షణకూ ఓ కమిషన్ ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేయడం విశేషం. 
Image result for ప్రియుడితో కలిసి భర్త హత్య
తాజాగా  ప్ర‌కాశం జిల్లాకు  చెందిన ఓ మ‌హిళ త‌న అక్ర‌మ‌సంబంధానికి భ‌ర్త అడ్డొస్తున్నాడంటూ ప్రియుడితో కలిసి ఆమె ఇంట్లోనే అత్యంత దారుణంగా వైర్ తో ఉరిబిగించి ప్రాణం తీసింది. ప్ర‌కాశం జిల్లా ద‌ర్శిలో పాణెం ఖాసీం బీకి అనే మ‌హిళ‌కు  స్థానికుడైన రమణయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొన‌సాగిస్తుంది. ఇదే విష‌యం స్థానికుల‌కు , ఆమె భ‌ర్త‌కు తెలిసింది. పరువు పోతుందని భర్త ఆమెను పలు మార్లు మందలించారు..దాంతో భర్తపై కక్ష్య పెంచుకున్న భార్య హ‌త్య చేయాల‌ని ప్లాన్ వేసింది.
Husband murdered by wife and her lover
ఇందుకు సాయంగా ప్రియురాలు ర‌మ‌ణయ్య‌ను ఇంటికి పిలిపించుకుంది. ప్రియుడి సాయంతో భర్త గొంతుకు తీగ బిగించి ఉపిరాడకుండా చేసి చంపేసింది. అనంత‌రం స్థానికుల్ని న‌మ్మించేందుకు త‌న భ‌ర్తే ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడ‌ని ప్ర‌చారం చేసింది.  అప్పటికే ఆమె గురించి తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసున‌మోదు చేసుకున్న పోలీసులు నిందితురాల్ని విచారించడంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. తానే భ‌ర్త‌ను హ‌త్య చేసిన‌ట్లు ఒప్పుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: