వ్యవస్థ పూర్తిగా దిగజారి పోతోంది. విశ్వనగరం అమరావతి ప్రాంతంలో మరీ ధారుణ మారణ హోమాలు జరుగుతున్న మాట యదార్ధం. అయితే వీటి వెనక ఎవరున్నారనే అనే విషయంపై ప్రతిపక్ష వైసిపి ఎమెల్యేలు అధికారపక్షంపై దాడిచేయటం పరిపాటి అయింది. దాన్ని అధికార టిడిపి సమర్ధవంతం గా ఎదిరించలేని పరిస్థితులు నేల కొన్నాయి. ఎందుకంటే ఈ దురాగతాల వెనక టిడిపి ప్రముఖులే ఉన్నట్లు తెలుస్తుంది. దానికి తగ్గట్తు ప్రశ్నించిన వారిపై అసభ్య పదజాలంతో మహిళలను సైతం వదల కుండా తిట్టే బూతు సంస్కృతి నెలకొంది.
కాల్-మనీ, సెక్స్-రాకెట్, శాండ్-మాఫియా ఇలా అనేక వరుస అమరావతి కుంభకోణాల్లో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాత్ర ఉందని వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోడె ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, తనపై లేనిపోని ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే రోజా తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, మూడేళ్లుగా తనపై ఆమె చేస్తున్న ఆరోపణలతో తన కడుపురగిలిపోతోందని మండిపడ్డారు. కాల్-మనీ కేసులో పోలీసుల అత్యుత్సాహం వైఫల్యం ఉన్నాయని ఒక వ్యక్తికి సంబంధించిన విషయాన్ని రాష్ట్రం మొత్తానికి ఆపాదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా, ఆ పార్టీ నేత పార్థసారథి చేస్తున్న విమర్శలపై స్పందించారు. కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. తనపై రోజా పిచ్చి విమర్శలు చేస్తున్నారని వాటిని నియోజకవర్గ ప్రజలు నమ్మరని, అదే రోజాను ఒక వ్యభిచారి, బ్రోతల్ హౌస్ నడుపుతుందని తాను అంటే, కచ్చితంగా నమ్మేస్తారని ఆరోపించారు. నిరాధార ఆరోపణలు చేస్తే ఈసారి రోజాకు చెప్పుల దండతో స్వాగతం పలుకుతామని హెచ్చరించారు.
తనను ఎదుర్కొనే సత్తాలేకే పార్థసారథి, రోజాను అడ్డం బెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తనను చిన్నపిల్లోడిగా పోలుస్తూ, బచ్చా అనడం పార్థసారథి లుచ్చాతనానికి నిదర్శనమని ప్రసాద్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తనపై గెలిచే సత్తా పార్థసారథికి లేదని, దమ్ముంటే జగన్ ఇక్కడి నుంచి గెలవాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్ లాంటి అవినీతిపరుడు ఏపీలో కాకుండా వేరే దేశంలో ఉండి వుంటే కచ్చితంగా కాల్చి చంపేవారని బోడే ప్రసాద్ వ్యాఖ్యానించారు.