కేకే సర్వే.. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి ఇప్పటికే పరిచయమైన పేరు. తానో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను అని చెప్పుకునే కేకే.. ఆసక్తి కొద్దీ సర్వే రంగంలో అడుగుపెట్టానని చెబుతుంటారు. ఆయన 15 ఎంపీ స్థానాలపై స్వయంగా సర్వే నిర్వహించారు.


ఆ ఫలితాలను ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు. ఆయన సర్వేను బట్టి చూస్తే ఈ 15 ఎంపీ స్థానాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించబోతోందట. మొత్తం ఆయన సర్వే చేసిన 15 ఎంపీ స్థానాల్లో దాదాపు 13 స్థానాల వరకూ కచ్చితంగా వైసీపీ గెలుస్తుందని కేకే ధీమాగా చెబుతున్నారు. 

మిగిలిన రెండు స్థానాల్లో కూడా వైసీపీ గట్టిగా పోటీపడుతోందని.. ఒక స్థానంలో టీడీపీ, మరో స్థానంలోజనసేన వైసీపీకి గట్టి పోటీ ఇస్తన్నాయని ఆయన వివరించారు. 

కేకే సర్వే ప్రకారం.. వైసీపీ గెలిచే స్థానాలు ఇవే..  

విజయనగరం 
అరకు
అనకాపల్లి
విశాఖపట్నం
కాకినాడ
రాజమండ్రి 
ఏలూరు
గుంటూరు
నరసరావుపేట
నరసరావుపేట
బాపట్ల
ఒంగోలు
అనంతపురం

హిందూపురంలో టీడీపీ, నరసాపురంలో జనసేన వైసీపీకి గట్టిపోటీ ఇస్తున్నాయని కేకే తెలిపారు. చూడాలి ఈ ఫలితాలు ఎంతవరకూ నిజమవుతాయో..



మరింత సమాచారం తెలుసుకోండి: