వైఎస్ జగన్ ఏపీ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. తన శత్రువులపై విమర్శల బాణాలు జోరుగా సంధిస్తున్నారు. ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు కాకుండా పిట్టకథలతో అలరిస్తున్నారు. తాజాగా ఆయన తన ప్రచారంలో చెప్పిన పిట్టకథ చాలా ఆసక్తికరంగా ఉంది.


గతంలో రాక్షసులకు చాలా తలలుండేవి. రావణాసురిడికి పది తలలు ఉండేవి. ఇప్పుడు నారా సురుడికి కూడా పది తలలు ఉన్నాయి. కాకపోతే ఈ నారాసురుడికి పది తలలూ ఒక్క చోటే ఉండవు..ఒక్కో తల ఒక్కో చోట ఉంటుంది అంటూ తన శత్రువులపై అస్త్రాలు సంధించాడు జగన్. 


నారాసురిడి పది తలలు ఒకే చోట ఉండవు.. ఒకటి తన నెత్తినే ఉంటుంది. మరొకటి.. పెయిడ్ యాక్టర్.. పెయిడ్ పార్టనర్‌ ఇక్కడ ఇంకో తల.. అంటే పవన్ కల్యాణ్ అన్నమాట. మరో తల ఈనాడు దినపత్రిక రాజగురు రూపంలో తల ఉంటుంది.. మరొకటి ఆయన తోక పత్రిక ఆయన రూపంలో ఇంకో తల ఉంటుంది..  ఆ పేరు నేను చెప్పనవసరం లేదు. 

ఇతర ఇతర ఎల్లో మీడియా రూపంలో ఇంకో తల ఉంటుంది..రాజ్యాంగ వ్యవస్థల్లో తన మనుషుల రూపంలో ఇంకో తల ఉంటుంది. దొంగ పార్టీలు -  దొంగ విశ్లేషకుల రూపంలో ఇంకో తల ఉంటుంది. ఢిల్లీ నుంచి వచ్చే నాయకుల రూపంలో మరొక తల ఉంటుంది.

ఇన్నిన్ని తలలూ ఉన్నా.. వీరందరిదీ ఒకటే డైలాగ్‌.. ఒకటే లక్ష్యం.. వైఎస్‌ జగన్.. అంతే.. చంద్రబాబు ఐదేళ్ల దుష్టపాలనపై మాత్రం చర్చ జరగకూడదు.. మోసపు పాలనపై చర్చ జరిగితే.. చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావన్నది మీకందరికీ తెలుసు.. నిజాల మీద చర్చ జరగకూడదు.. గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలపై చర్చ జరగకూడదు.. అదే ఈ పది తలల లక్ష్యం అంటూ జగన్ ఇంట్రస్టింగ్ గా కథ వినిపించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: