విజయనగరం జిల్లా పార్వతీపురంలో పర్యటించిన సమయంలో వైఎస్ జగన్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి ఈ జిల్లాకు చేసిన సేవలను తలచుకుని గద్గత స్వరంతో మాట్లాడారు. దివంగత వైఎస్ వెనుకబడిన ఈ జిల్లాకు ఎంతో సేవ చేస్తే.. చంద్రబాబు పూర్తిగా మోసం చేశారన్నారు. 


గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి .. ఈ జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టును రాజశేఖర్ రెడ్డి 450 కోట్లు వెచ్చించారు. 90 శాతం పనులు వైఎస్సార్ హయాంలో పూర్తయ్యాయి.. కనీసం మిగిలిపోయిన ఆ పది శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు చంద్రబాబు. ఈవిషయాన్ని జగన్ ప్రముఖంగా ప్రస్తావించారు.  

ఒరిస్సాతో వివాదం ఉన్నా.. వైఎస్ గతంలో చంద్రావతి ప్రాజెక్టు కోసం చొరవ తీసుకున్నారు. కనీవినీ ఎరుగని విధంగా రబ్బర్ డాం తీసుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి. కానీ అలాంటి ప్రాజెక్టును కూడా చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు. ఈ విషయంపై జగన్ విమర్శలు గుప్పించారు. 

చంద్రబాబు స్పెషల్ ఫ్లయిట్లు వేసుకుని టిఫెన్ కు స్టాలిన్ వద్దకు చెన్నై వెళ్తారు..  భోజనానికి కలకత్తా  మమత బెనర్జీ వద్దకు వెళ్తారు. ఇంకా  కాఫీ కోసం రాహుల్ గాంధీ వద్దకు ఢిల్లీ వెళ్తారు స్పెషల్ ఫ్లయిట్ వేసుకుని.. కానీ  పక్కనే ఉన్న ఒరిస్సా వద్దకు మాత్రం పోడని విమర్శించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: