ఆంధ్రా కింగ్ ఎవరు.. ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఇవే అందరి బుర్రలూ తొలిచేస్తున్న ప్రశ్నలు. రోజుకో సర్వే వెలుగు చూస్తూ ఈ టెన్షన్ ఇంకొంచెం పెంచుతున్నాయి.
తాజాగా రాజకీయ జ్యోతిష్యుడు ప్రదీప్ జోషి తన వాదన వినిపించారు. సింపుల్ గా ఆయన గెలుస్తారు.. ఈయన ఓడిపోతారు అని కాకుండా.. ఈ జోషి చెప్పిన వాదన ఇంకాస్త ఆసక్తికరంగా ఉంది. ఆయన లెక్క ప్రకారం.. జగన్ పార్టీ 73 సీట్లు కచ్చితంగా గెలుస్తుందట.
అంటే జగన్ ఓడిపోయినట్టేనా.. అంటే కాదట. మరో 36 స్థానాల్లో అతి తక్కువ మెజారిటీతో కోల్పోయే అవకాశం ఉందట. ఎంత తక్కువ అంటే వంద, రెండు వందలు ఓట్లే కొంపముంచే ఛాన్సు ఉందట. కాబట్టి.. ఈ సీట్లలో విజయం సాధిస్తే ఆయనే సీఎం అవుతారట.
మరి ఈ 36 సీట్లు గెలవాలంటే ఏంచేయాలి.. అమ్మవారి ఉపాసన, కాపాలిక వంటి హోమాలు చేయాలట. ఈ విషయాన్ని ఆయనకు ఇప్పటికే జ్యోతిష్యులు చెప్పారట. ఆ దిశగా జగన్ హోమాలు కూడా చేస్తున్నారని తనకు తెలిసిందని జోషి అంటున్నారు. మరి ఈ హోమాలు ఫలిస్తాయా.. చూడాలి.