చివరి నిమిషంలో విజయవాడ ఎంపీ టికెట్ గెలుచుకున్న పొట్లూరి వర ప్రసాద్‌ విజయం సాధించబోతున్నారా.. విజయవాడ నుంచి బంపర్ మెజారిటీతో  సక్సస్ చవిచూడబోతున్నారా.. అంటే అవునంటోంది తాజాగా వచ్చిన న్యూ ఆంధ్రా సర్వే. 


విజయవాడ నుంచి పీవీపీ గెలుపు ఖాయం అని చెబుతోంది. ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని హోరాహోరీ పోరు కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. వాస్తవానికి కేశినేని నాని.. చాలా ముందు నుంచే ప్రచార బరిలో ఉన్నారు. 

పీవీపీ చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నారు. అందులోనూ టీడీపీ ఏపీ కాస్త బలంగా ఉన్నది కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే అని చెబుతారు. అందులోనూ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలు కావడంతో కేశినేని గెలుపు సులభమే అనుకున్నారు చాలావరకూ. 

కానీ లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చిన సినీ నిర్మాత, పారిశ్రామిక వేత్త పొట్లూరి వర ప్రసాద్‌.. ప్రచారం జోరుగానే సాగించారు. తక్కువ సమయంలోనే విస్తృతంగా పర్యటించారు. వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డారు. అసెంబ్లీ అభ్యర్థుల విజయాలు కూడా పీపీవీ కలిసివచ్చేలా ఉన్నట్టు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: