రాష్టంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై, నాయకులపై జరుగుతున్న దాడులను, దౌర్జన్యాలను ఖండిస్తూ టిడిఎల్ పి తీర్మానం ఆమోదించింది. కార్యకర్తల రక్షణ కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కార్యకర్తల రక్షణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, 15వ తేదీ వర్క్ షాప్ లో దీనికి సంబంధించి కార్యాచరణ సిద్దం చేయాలని తీర్మానించింది.

శాసన సభ తొలిరోజు సమావేశాల సందర్భంగా అందరూ పసుపు చొక్కాలతో అసెంబ్లీకి హాజరు కావాలి. ఉదయం 9.30కల్లా ఉండవల్లి అధ్యక్షుల వారి నివాసం వద్దకు చేరుకుని అక్కడ నుంచి బయల్దేరి వెంకటపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకుంటారు.ఈ భేటిలో చంద్రబాబు మాట్లాడుతూ,‘‘ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకత్వ సామర్ధ్యం బైటపడుతుంది. పార్టీ పట్ల, ప్రజల పట్ల బాధ్యత తూచా తప్పకుండా నిర్వర్తించాలి.

కార్యకర్తల్లో, నాయకుల్లో ఆత్మ విశ్వాసం పెంచాలి. మనో ధైర్యం పెంచాలి. సమస్యల పరిష్కారంపై మన పోరాట పటిమ ప్రజల్లోకి వెళ్లాలి.గత 15రోజుల్లో అనంతపురం, ప్రకాశం జిల్లాలలో, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, గుంటూరు జిల్లా గురజాల, నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాలలో, ఇతర ప్రాంతాలలో టిడిపి కార్యకర్తలపై, నాయకులపై దాడులు చేయడం, దౌర్జన్యాలకు పాల్పడటం గర్హనీయం. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది. దీనిపై జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పార్టీ తరఫున ఏం చేయాలనేదానిపై కార్యాచరణ రూపొందించాలి. నియోజకవర్గంలో ఎప్పుడేం జరుగుతుందో సమాచారం నేరుగా తెలియజేయాలి. దానినిబట్టి అప్రమత్తం కావడానికి దోహదపడుతుంది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం పట్టుదలతో పోరాడదాం. హక్కుల సాధనే తెలుగుదేశం పార్టీ లక్ష్యం.

పేదల సంక్షేమమే మనందరి ధ్యేయం కావాలి. తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక అవసరం. ప్రజల పట్ల పూర్తి బాధ్యత ఉన్న పార్టీ తెలుగుదేశం. గత 37ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాం. ఎన్టీఆర్ హయాంలో, ఆ తరువాత అనేక అవమానాలు భరించాం. రాజీవ్ గాంధీ హత్యోదంతం దరిమిలా విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుంటే ఎన్టీఆర్ కు ఎదురైన అవమానాలను గుర్తుంచుకోవాలి. అన్నింటిని తట్టుకుని నిలబడ్డామంటే అదంతా ప్రజల వల్లే. పార్టీ కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం పట్టుదలతో పోరాడటమే మనందరి కర్తవ్యం. ఏదో ఆవేదన కనిపిస్తోంది. ఏం జరిగింది, ఇదెలా జరిగిందనే ప్రశ్నలే అందరిలో..


మరింత సమాచారం తెలుసుకోండి: