అమరావతిలోని ప్రజావేదిక కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. ఇందులో భాగంగా విద్యాశాఖపై సీఎం జగన్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ల సదస్సు ఇవాళ, రేపు రెండ్రోజులు జరుగనున్నాయి. రాష్ట్రంలోని విద్యా ప్రమాణ పై సీఎం జగన్ సమీక్షించనున్నారు.

 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్రంలో నూరు శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు. తనకు అత్యంత ప్రాధాన్య రంగాల్లో విద్యాశాఖ కూడా ఒకటన్నారు. రాష్ట్రంలో నిరక్ష్యరాస్యత 33 శాతంగా ఉందని.. జాతీయ స్థాయి సగటు కన్నా ఇది ఎక్కువని చెప్పారు.

 

అందుకే తల్లులను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి పథకాన్ని తీసుకొస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని జగన్‌ వివరించారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామని.. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తామన్నారు.

 

విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు సకాలంలో అందిస్తామని చెప్పారు. వారికి షూ కూడా ఇవ్వాలనే ఆలోచన ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి బడుగు, బలహీన వర్గాలు దీనిని ఆమూలాగ్రం వినియోగించుకోవాలని అయన కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: