పాకిస్తాన్ ఎంతగా దిగజారిపోయింది అంటే.. ఇండియాను బ్లేమ్ చేసేందుకు ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేంత వరకు వెళ్ళింది.  ఆర్టికల్ 370 రద్దు తరువాత ఈ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.  కాశ్మీర్ లో ఏదో జరిగిపోతున్నది.  ఏదో అయిపోతున్నది... అని తెగ రాద్ధాంతం చేస్తున్నారు.  ఈ రాద్ధాంతం ఎందుకు చేస్తున్నది అంటే కాశ్మీర్ లో చిచ్చు పెట్టేందుకు.  కాశ్మీర్ ను ప్రశాంతంగా ఉండకుండా చేసేందుకు ఇలాంటి ఎత్తులు వేస్తున్నది పాక్.  


అవసరమైతే యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అంటున్నది.  యుద్ధం చేయడం అంటే మాటలు కాదన్న సంగతి పాపం పాక్ కు తెలిసినట్టు లేదు.  పైగా అణుయుద్ధం చేస్తామని ఆదరగోడుతున్నది.  ఇదిలా ఉంటె, గతంలో ఇండియా రాయబారిగా పనిచేసిన అబ్దుల్ బాసిత్ ఓ ట్వీట్ చేశారు.  కాశ్మీర్ లో అల్లర్ల కారణంగా ఓ వ్యక్తి తన చూపును కోల్పోయాడని చెప్పి ట్వీట్ చేశారు.  


కాశ్మీర్ లో అరాచకాలు జరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి అయన ట్వీట్ చేశారు.  క్షణాల్లో ఆ ట్వీట్ వైరల్ అయ్యింది.  పాపం తెలియాలని వళ్ళంతా నిజమే అని నమ్మి ఆ ట్వీట్ ను రీట్వీట్ చేయడం మొదలుపెట్టారు.  అంతేకాదు, పాకిస్తాన్ కు చెందిన వ్యక్తులైతే ఈ విషయంపై పెద్ద రాద్ధాంతం సృష్టించారు.  చివరకు ఓ విషయం తెలిసి షాక్ అయ్యారు.  


అదేమంటే.. అయన ట్వీట్ చేసిన ఫొటోలో ఉన్నది ఓ పోర్న్ స్టార్ అని కాశ్మీర్ విషయం కాదని చెప్పి పాకిస్తాన్ కు చెందిన ఓ జర్నలిస్ట్ మెసేజ్ ట్వీట్ చేసింది.  అంతే అబ్దుల్ బాసిత్ షాక్ అయ్యాడు.  పొరపాటు జరిగిందని గ్రహించి ఆ ట్వీట్ ను డిలేట్ చేశారు.  ట్వీట్ అప్పటికే వైరల్ అయ్యింది.  తప్పులను ప్రచారం చేయడంలో పాక్ ఎప్పుడు ముందు ఉంటుంది అనడానికి ఇదొక నిదర్శనం అని అందరు దుమ్మెత్తి పోస్తున్నారు.  కాశ్మీర్ విషయం ఇండియా అంతర్గత వ్యవహారం అని ఇప్పటికే ప్రపంచ దేశాలు పాక్ కు వార్నింగ్ లు ఇస్తున్నా.. పాపం పాకిస్తాన్ ఇలా తప్పులు చేస్తూనే ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: