హైదరాబాద్ కు చెందిన డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ పైన విశాఖపట్నం ప్రాంతంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన యరడా బీచ్ రిసార్ట్ నిర్వహణ బాధ్యతలు పెట్టారు. నెలకు రూ1.5 లక్షలు పర్యాటక అభివృద్ధి సంస్థకు చెల్లించేలా ఒప్పందం జరిగింది. దీని నిర్వహణ బాధ్యతను అప్పగించారు. బీచ్లో నీడనిచ్చే గుడిసెలు, బెంచీలు, రెస్టారెంట్, యాంఫీ థియేటర్, చిల్డ్రన్ ప్లే ఏరియా, టాయిలెట్లు వంటి సౌకర్యాలు కల్పించారు.
యరడాలో సముద్ర తీరాన పర్యాటక శాఖ నిర్మించిన బీచ్ రిసార్ట్ను ఆదివారం ప్రారంభించనున్నారు.మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ పర్యాటక శాఖ అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ ప్రాజెక్ట్కు ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు వెచ్చించింది. బీచ్లో నీడనిచ్చే గుడిసెలు, బెంచీలు, రెస్టారెంట్, యాంఫీ థియేటర్, చిల్డ్రన్ ప్లే ఏరియా, టాయిలెట్లు వంటి సౌకర్యాలు కల్పించారు. యరడా బీచ్ మూడు వైపులా కొండలు మరియు నాల్గవ వైపున బెంగాల్ బే చుట్టూ ఉంది, ఇది పచ్చదనం మరియు మృదువైన బంగారు ఇసుకతో కప్పబడి ఉంటుంది.ఈ తీరప్రాంతంలో మంత్రముగ్ధులను చేసే సూర్యోదయం మరియు సూర్యాస్తమయాలను చూడటానికి ప్రకృతి ప్రేమికులకు ఇది అనువైన ప్రదేశం. విశాఖపట్నం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్ చాలా రద్దీగా ఉంటుంది.
దీనిని ఇంకా అభివృద్ధి చేయడానికి ఆ సంస్థ పలు ప్రణాళికలు సమర్పించింది. వాటిపై చర్చించి, ఆమోదించాల్సి ఉంది. ఈ పనులను ఎన్నికలకు ముందు ప్రారంభించారు. ఎన్నికల కోడ్ అడ్డంకి కావడంతో శంకుస్థాపన వంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఆదివారం బీచ్ రిస్టార్ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించినప్పుడు ఈ కార్యక్రమాలు కూడా పూర్తి చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.ఇక్కడ సముద్రం లోతైన నీలం రంగు, ఇసుక కూడా బంగారు కాంతితో విలీనం అయినప్పుడు, బీచ్ స్వర్గంగా కనిపిస్తుంది, మరియు యారాడా బీచ్ పర్యటన మీ తప్పక సందర్శించవలసిన జాబితాలో ఉండాలి