మరోవైపు జనసేన పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపుల సంఖ్య బలంగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు ఒక్కొక్కరిని కోల్పోతుంది.2019 ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శన చేసిన తర్వాత వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారు.ఇప్పటికే రావెల
కిశోర్ బాబు, పార్థసారథి తదితర నేతలు పార్టీని వీడారు.
ఒకప్పుడు వైఎస్ హయాంలో
కాంగ్రెస్ పార్టీకి
బలంగా మద్దతునిచ్చిన కాపు నేతలు రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ వైపు మొగ్గు చూపగా మరికొందరు
బీజేపీలో చేరారు.
ఆ ప్రభావం
2014 ఎన్నికల్లో కనిపించింది. ఇప్పుడు మళ్లీ కాపు నేతలను తమ వైపు తిప్పుకోవాలని
జగన్ భావిస్తున్నార ని తెలుస్తుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన
ఆకుల సత్యనారాయణ 2019 ఎన్నికల్లో పార్టీ తరఫున లోక్ సభకు పోటీ చేసి ఓడారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిన ఆయన.. వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారనే వార్తలొస్తున్నాయి.
కాపు సామాజిక వర్గానికి చెందిన ఆకుల చేరికకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని..
దసరా వేళ ఆయన అధికార పార్టీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. గతంలో రావెల
కిశోర్ బాబు జనసేనను వీడినప్పుడే.. ఆకుల సత్యనారాయణ కూడా పార్టీ మారతారనే అందరు భావించారు. కానీ ఆయన మాత్రం సైలెంట్ అయ్యారు. ఇప్పటికే తోట త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీ గూటికి చేరారు.
ఉభయగోదావరి జిల్లాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులను, కాపు నాయకులను తమ వైపు తిప్పుకుంటే పార్టీ మరింత బలపడుతుందనేది
జగన్ యోచనగా ఉంది.కాగా ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీ మారారు. ఒక పక్క ఆరోగ్యం సహరించక పార్టీ పనులకు దూరంగా ఉంటున్నారు జనసేనాని. ఈ సమయంలో వరుస వలసలు జనసేన పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నాయి.