ఈ మద్య చాలా వరకు ఎవరూ ఊహించని ప్రమాదాలు జరగడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రకృతి వైపరిత్యాలతో కొన్ని ప్రాణాలు పోతుంటే..రోడ్డు ప్రమాదాల వల్లే ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. ఇక అనుకోని ఘటనలు జరగడం..ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా చిత్తూరు జిల్లా పాకాల మండటంలో అగ్ని ప్రమాదం జరిగింది.

షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు చెలరేగడంతో పేటిన యూపిఎస్ బ్యాటరీ. మంటల్లో తల్లీ,కొడుకులు సజీవదహనం అయ్యారు. మృతురాలు శంకరమ్మ (80), కుమారుడు శేఖర్ (50) లు అక్కడికక్కడే మరణించారు. కాగా, తల్లీ కొడుకులు ప్రమాదాన్ని గమనించేలోగానే పూర్తిగా మంటలు వ్యాపించడంతో ఈ దారుణం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. 

షార్ట్ సర్క్యూట్ జరగడం..ఒక్కసారే మంటలు వ్యాపించడం శంకరమ్మ ఆమె కుమారుడు బయటకు రాలేని పరిస్థితిలో సజీవ దహణం అయినట్లు సమాచారం అందుతుంది.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: