తెలంగాణ రాష్ట్ర సమితి అంటేనే  ఉద్యమ పార్టీ. అలాంటి ఉద్యమ పార్టీకి ఊపిరి పోసింది  కార్మికులు. అలాంటి కార్మిక వర్గాల్లోనే  ప్రస్తుత కేసీఆర్ పాలనపై  పూర్తి వ్యతిరేకత మొదలయింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె  ఇప్పుడు మరింత తీవ్రంగా మారనుంది. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తీసుకొచ్చారు  కెసిఆర్ అంటున్నారు. ఎలాంటి ఉద్యమాల ద్వారా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచి  లబ్ధి పొంది రాష్ట్రాన్ని విడదీయగలిగారో,ఇప్పుడు ఆయా  ఉద్యమాలకే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఊపిరి పోస్తూ ఉండటం ప్రశ్నర్ధకంగా మారింది.



అసలు ప్రతిపక్షాలు కేసీఆర్ మీద కారాలూ మిరియాలూ నూరుతూ ఉన్నాయి. ఈ  సమయంలో ఆర్టీసీ వ్యవహారం వారికి  మరింత  అనుకూలంగా మారుతూ ఉంది. కేసీఆర్ మీద దుమ్మెత్తి పోయడానికి వారికి అవకాశం వస్తుంది.ఈ విషయంపై కేసీఆర్ మరియు ఇతర సభ్యులు ఎదురుదాడి చేసినా పెద్దగా ప్రయోజనాలు కనిపించవనే చెప్పచు.  అయినా  ఆర్టీసీ విషయంలో కేసీఆర్ ఇంత ఇగో ఫీలింగ్ కు ఎందుకు పోతున్నాడు? అనేదే పెద్ద ప్రశ్నగా మారింది..కార్మిల సంఘాలు నిరసన బాట పట్టినప్పుడే వారిని పిలిపించుకుని మాట్లాడాల్సింది. అయితే  ఆ సంఘాలతో మాట్లాడేదే లేదని భీష్మించుకున్నారు. ఫలితంగా పరిస్థితి చేయిదాటిపోయింది.


ఈ  సమయంలో శ్రీనివాస రెడ్డి అనే డ్రైవర్ ఆత్మహత్య కార్మికుల సమ్మెను మరింత  ఉద్రికతను పెంచింది . తెలంగాణ ఉద్యమంలోనూ ఆ ప్రాంతంలో ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ వచ్చాకా కూడా అలాంటి ఆత్మహత్యలే నమోదు కావడం విచారకరం. ఇది కేసీఆర్ పై తీవ్రమైన వ్యతిరేకతను పెంచే అంశమే.ఎన్నికలు ఇప్పుడప్పుడే లేకపోవచ్చు గాక అయితే మెజారిటీ ప్రజలతో కార్మిక వర్గాలతో కేసీఆర్ కు ఇక్కడ నుంచే దూరం పెరిగే అవకాశం ఉంది. అవతల ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం ఏపీలో ఆర్టీసీని విలీనం చేశారు.

అయితే ఆర్టీసీ కార్మికులకు ఎటువంటి సమస్య అయినా తన సమస్యగా భావిస్తా అని ఉద్యమం సమయంలో ప్రకటించిన కేసీఆర్, ఇప్పుడు ఆయన ప్రభుత్వంలోకి  ఆర్టీసీ విలీనానికి సానుకూలంగా కనిపించడం లేదు.  కార్మికుల కోరికలను కూడా వినే పరిస్థితే లేదు అన్నట్టు ఉంది ఆయన తీరు.  ఆర్టీసీ సమ్మె చేస్తే ఇబ్బంది పడేది  ఒక్క కార్మికులు మాత్రమే కాదు,అటు సామాన్య ప్రజలు  అంతకన్నా ఎక్కువ ఇబ్బందులే  పడ్తున్నారు అన్న విషయాన్ని తెలంగాణ సీఎం ఎప్పుడు గ్రహిస్తారో ఇక ! మరి ఇకనైనా ఆయన తన ఇగోని వదిలి సమస్యని పరిష్కరించే విధంగా ముందగుడు వేయాలని ఆకాంక్షిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: