చండీగఢ్ లో
2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత
కాంగ్రెస్ పార్టీలో మొదలైన రాజీనామాల పర్వం ప్రస్తుతానికి కూడా కొనసాగుతుంది. గతంలో వివిధ కారణాలతో పార్టీ నేతలు రాజీనామాలు చేసిన కూడా ఏఐసీసీ అధ్యక్ష పదవికి
రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత..
కాంగ్రెస్ నేతల రాజీనామాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఇటీవల అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో మరో
కాంగ్రెస్ నేత పార్టీకి
రాజీనామా చేయడం జరిగింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్దూ
కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోవడం జరిగింది.
నవజ్యోత్ కౌర్ సిద్దూ పార్టీ నుంచి తప్పుకునట్లు జాతీయ
మీడియా తెలియచేయడం జరిగింది. పంజాబ్ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి
అమరీందర్ సింగ్ కు నవజ్యోత్ కౌర్ సిద్దూ కుటుంబానికి మధ్య చాలా రోజుల నుంచి కోల్డ్ వార్ జరుగుతుంది. ఇక నవజ్యోత్ భర్త సిద్ధూను పంజాబ్ క్యాబినెట్ నుంచి వెళ్లినప్పటి నుంచి వార్ బాగా తీవ్రంగా మారింది.
అమృత్ సర్ కెప్టెన్
అమరీందర్ సింగ్ మంత్రివర్గం నుంచి తప్పు కున్న తర్వాత నుంచి సిద్ధూ మౌనంగా ఉంటున్నారు.. ఆయన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ
కాంగ్రెస్ కు
రాజీనామా చేయడం మాజీ క్రికెటర్ పార్టీ మారడంపై చాల ఊహాగానాలు జరిగాయి. సిద్ధూ తిరిగి భాజపా పార్టీలోకి మారుతున్నారు అని చాలా వార్తలు వినిపించాయి. ఈ విషయంపై సిద్దు భార్య నవజ్యోత్ కౌర్ వివరణ ఇవ్వడం జరిగింది.
సిద్ధూ తిరిగి భాజపాలో చేరుతారన్న విషయాని కొట్టి వేయడం జరిగింది. అవి కేవలం ఊహాగానాలు మాత్రమేనని అని తెలియచేయడం జరిగింది. మంత్రిగా తన భర్త నవజ్యోత్ కౌర్ బాగా పనిచేసినప్పటికీ కూడా సొంత పార్టీలోనే కొందరు కెప్టెన్
అమరీందర్ సింగ్ కు లేనిపోనీ విషయాలు చెప్తున్నారని ఆరోపణలు చేయడం జరిగింది. కేబినెట్ నుంచి బయటికి వచ్చినప్పటికీ ఎమ్మెల్యేగా కొనసాగుతాను అని తెలియచేసారు.