ఆరోగ్యశ్రీ.. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానన పుత్రిక.. లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపిన మానవీయ పథకం. ఇలాంటి మానవీయ పథకాల కారణంగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప ముఖ్యమంత్రిగా జనం గుండెల్లో నిలిచిపోయారు. ఇప్పుడు జగన్ దాన్ని మరింతి మెరుగు పరుస్తున్నారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన ప్రతిష్టాత్మక డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.


ఆరోగ్య శ్రీ ఇప్పుడు ఏపీలో బ్రహ్మాండంగా అమలవుతోంది. కానీ.. కొన్ని రకాల జబ్బులకు ట్రీట్ మెంట్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పెద్ద నగరాల ఆసుపతుల్లోనే సాధ్యమవుతోంది. అవి ఏపీ బయట ఉన్నందువల్ల వాటికి ఆరోగ్య శ్రీపథకం వర్తించడం లేదు. ఇలాంటి సమయాల్లో రోగులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇప్పుడు ఇక ఆ ఇబ్బంది లేకుండా జగన్ నిర్ణయం తీసుకున్నారు.


ఇతర రాష్ట్రాల ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందించేలా జగన్ చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రజలకు నవంబర్‌ 1వ తేదీ నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉన్న 150 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 716 సూపర్ స్పెషాలిటీ ట్రీట్‌మెంట్లకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజారోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇక ఏపీలో ఇప్పటికే వైద్య సేవలు అందుతున్నాయి.


ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్‌ చేయించుకున్న పేషెంట్లు కోలుకునే వరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున ఇస్తామని, రోగి ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే నెలకు రూ.5 వేలు చెల్లిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీకి అనుగుణంగా నేడు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు వెలువరించింది. డిసెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: