తెలుగులో అప్పుడెప్పుడో ఈవీవీ సత్యన్నారాయణ జంబలకడి పంబ
సినిమా చేశారు గుర్తుంది కదా.. ఆ సినిమాలో ఓ
మహిళ పురుష ప్రపంచంపై ద్వేషంతో ఓ మందును కనిపెడుతుంది. ఆ మందు తాగిన వ్యక్తులు మారిపోతారు. మహిళలు పురుషులుగా, పురుషులు మహిళలుగా మారిపోతారు. వారిలోని కోరికలు కూడా అలాగే మారిపోతాయి. కారణాం ఏంటి.. అంటే
ఆమె కనిపెట్టిన మందు
మహిమ అని చెప్పొచ్చు.
అయితే, ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు ఇటీవల కాలంలో జరుగుతున్నాయి. అలాంటి సంఘటన ఒకటి యూపీలో జరిగింది. ఓ అమ్మాయి, అబ్బాయి ఘాడంగా ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్నాక ఇద్దరు కలిసి చాలాకాలం తిరిగారు. కలిసిమెలిసి ఎంజాయ్ చేశారు. ఏమైందో ఏమో తెలియదు..
పెళ్లి మాట ఎత్తితే అబ్బాయి పారిపోతున్నాడు. ఎలాంటి సమాధానం చెప్పడం లేదు.
దీంతో ఆ అమ్మాయి అబ్బాయిపై నిఘా పెట్టింది. ఎలాగైనా సరే వాడికి బుద్ధిచెప్పాలని అనుకుంది. మాములుగా అబ్బాయిలు అమ్మాయిపై యాసిడ్ పోస్తుంటారు. కానీ, ఇక్కడ దానికి విరుద్ధంగా జరిగింది. ఆ అమ్మాయి అబ్బాయిపై నిఘా పెట్టి సమయం కోసం వేచి చూసింది. అనుకున్నట్టుగానే అన్ని కుదిరాయి. అబ్బాయి ఒంటరిగా బయటకు రావడం గమనించిన ఆ అమ్మాయి కోపంగా అతని మొహంపై యాసిడ్ పోసి పరారైంది. అంతే, అందరూ షాక్ అయ్యారు.
హుటాహుటిన తల్లిదండ్రులు ఆ యువకుడిని హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్యం చేయించారు. తరువాత ఆ అమ్మాయిని పోలీసులు అదుపులోకి తీసుకోగా
ఆమె చెప్పిన విషయం విని షాక్ అయ్యారు. తన ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి తనను అల్లరి చేస్తానని బెదిరించాడని అందుకే అలా చేశానని చెప్పింది. ఎన్ని చెప్పినా ఇప్పుడు ఉపయోగం ఏముంటుంది.. తప్పు చేసినపుడు జైలు శిక్ష అనుభవించాలి కదా. పాపం
ఆమె విషయంలో అదే జరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో.