గుంట నక్కలు, రాబందులు శవాల వేటకు బయలు దేరాయని
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. నిత్యం సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు
ఎంపీ విజయసాయి. ప్రస్తుత రాజకీయాల్లో ఉన్న నేతలపైనా, పార్టీల పనితీరుపైనా సెటైర్లు వేయడంతో ఆయన అందే వేసిన చేయి. ఏపీలోని ప్రతిపక్షాలపై ట్వీట్టర్లో దుమ్మెత్తిపోస్తూ నిత్యం చర్చల్లో నిలిచే విజయసాయిరెడ్డి కొద్ది సేపటి క్రితం చేసిన పోస్టు ఏపీలో రాజకీయ ప్రకంపనలే సృష్టిస్తోంది.
విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇలా ఉంది. గుంట నక్కులు, రాబందులు శవాల వేటకు బయల్దేరాయి. ఎక్కడ ఒక ప్రాణం పోయినా పండుగే వాటికి. చిన్న సమస్యలను పెద్దవి చేసి చూపడం. ఇబ్బందుల్లో ఉన్న వారిని మరింత రెచ్చగొట్టడమే రాబందులకు తెలిసిన విద్య. పీక్కు తినడమే వచ్చు. ప్రాణం పోయడం ఎలాగూ తెలియదు. అంటూ ప్రతిపక్షాల వైఖరిపై ఆయన దుమ్మెత్తి పోశారు. ప్రతిపక్షాలు ఇసుకపైన, భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న తీరుపైన నిరసనలు తెలుపడానికి సన్నద్దం అవుతున్నాయి. చివరకు ఈ పోరులో జనసేనకు
బీజేపీ, కమ్యూనిస్టులు సైతం మద్దతు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
అదే విధంగా
టీడీపీ నేతల ఇళ్ల చుట్టూ
వైసీపీ నేతలు రాతితో కట్టడాలు చేయడం, ఇటుకతో రోడ్డుకు అడ్డుగా కట్టడాలు నిర్మించడం పై ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నారు. దీనికి స్పందించిన విజయసాయి తనదైన మార్క్లో సెటైర్లు వేస్తూ ప్రతిపక్షాలు చిన్న విషయాలను పెద్ద విషయాలుగా చేస్తున్నారని అందులో ప్రస్తావించారు. ఇక ప్రతిపక్ష నేతలను రాబందులు, గుంట నక్కలు అంటూ చురకలు అంటించారు. ప్రజలను ప్రతిపక్ష నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఎలా పీక్కుతిన్నారో అని తన ఉద్దేశ్యాన్ని చాటిచెప్పారు. ఎంతైనా విజయసాయిరెడ్డి సెటైర్లతో రాజకీయ ప్రకంపనలు వస్తున్నాయి.