ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కోర్టుకు హాజరైతే తప్పేంటని ప్రశ్నించారు సివిల్ సప్లైస్ మంత్రి కొడాలి నాని. కోర్టుకు వెళ్లినంత మాత్రాన సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు అయన. కోర్టులు చట్ట వ్యతిరేక జూదశాలలు కాదు కదా అంటూ ప్రశ్నించారు మంత్రి గారు. ఎవరైనా వెళ్లొచ్చు రావచ్చు, చంద్రబాబు సోనియా గాంధీతో కలిసి జగన్‌ పై అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించారు. 


త్వరలోనే జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టు తీర్పు పై హైకోర్టుకు వెళ్తామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కోర్టుకు హాజరయ్యేందుకు అయ్యే ఖర్చుతో సమస్య లేదని రాష్ట్రానికి సంబంధించి కీలకమైన సమయం వృథా అవుతుందని మరో మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు.


శుక్రవారం నాడు ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌మోహన్‌ రెడ్డికి సీబీఐ కోర్టులో గట్టి చుక్కెదురయ్యింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ ను హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టి వేసింది. సీబీఐ జగన్ పిటిషన్‌ పై గట్టిగా వాదనలు వినిపించింది. ఈ కేసులో పరిస్థితులు చాలానే మారాయి. సీఎం జగన్ ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేయాలని ప్రయత్నించారని, జగన్ ఇప్పుడు సీఎం స్థానంలో ఉన్నారని మినహాయింపు ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని చెప్పింది కోర్టు. 


సీబీఐ వాదనతో ఏకీభవించిన సీబీఐ కోర్టు పిటిషన్‌ ను రద్దు చేసింది. సీబీఐ కోర్టు తీర్పు అంశాన్ని ప్రస్తావిస్తూ, టీడీపీ పార్టీ సీఎం జగన్‌ మోహన్ను రెడ్డి  ను టార్గెట్ చేసింది. ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చెయ్యాలనే డిమాండ్ కూడా వాళ్లు తెరపైకి తీసుకొచ్చారు. దీని పైనే మంత్రులు స్పందించారు ఇప్పుడు, టీడీపీ నేతల ఆరోపణల్ని తిప్పికొట్టారు ఈ మంత్రులు ఇప్పుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: