రాజకీయ పార్టీలన్నీ ఎంతోకొంత (30) రోజులుగా తెలంగాణలో జరుగుతోన్న
ఆర్టీసీ శ్రామికుల సమ్మెపై స్పందించాయి. అయితే ఇప్పటి వరకూ టీఎస్ఆర్టీసీ
సమ్మె పై తెలంగాణా లోని ప్రతిపక్షం ఎంఐఎం స్పందించలేదు. భాధ్యతాయుతమైన ప్రతిపక్షం 30 రోజులుగా 50000 తెలంగాణా ఉద్యోగుల భవితవ్యంపై భాధ్యతెరిగి ప్రవర్తించ లేదు.
అయితే ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ తాజాగా టిఎస్
ఆర్టీసీ సమ్మెపై మాట్లాడుతూ
కేసీఆర్ నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.
ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య లకు పాల్పడవద్దని తమ దయాహృదయం ప్రదర్శించారు. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలా? వద్ధా ? అన్నది
కేసీఆర్ ఇష్టమని, అయితే ఆయన
ఆర్టీసీ నెంబర్ ప్లేట్ లో ఉన్న “Z” అక్షరాన్ని తొలగించవద్దని అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు. “Z” అక్షరాన్ని అసదుద్దీన్ ఒవైసీ ఎందుకు తొలగించవద్దని కోరారన్నది
చరిత్ర తెలిసిన వారికి అవగతమై ఉంటుంది.
నిజాం ప్రభుత్వ హయాంలో ఏర్పడిన ఆర్టీసీ కాలక్రమేణా తెలంగాణాలో అతి పెద్ద రవాణా సంస్థగా ఆవిర్భవించింది. అప్పటి ఏడో నిజాం తల్లి జహ్రా బేగం పేరిట బస్ నంబర్ సిరీస్ లో “Z"అక్షరాన్ని ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.
అయితే నాటి అవిభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోనూ ఆమె గౌరవార్ధం “Z” అక్షరాన్ని నాటి ప్రభుత్వాలు కొనసాగించారు. ఇప్పుడు టిఎస్ ఆర్టీసీలో నూతన సంస్కరణ లను తీసుకొస్తున్న సందర్భంగా
కేసీఆర్ ప్రభుత్వాన్ని “Z” అక్షరాన్ని తొలగిస్తారేమోనన్న ఆలోచనతోనే అసదుద్దీన్ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేస్తూ,
కేసీఆర్ కు తన విఙ్జాపణ చేశారు. మొత్తం మీద టిఎస్
ఆర్టీసీ ఉద్యోగులు 30 రోజులుగ చేసే సమ్మెపై కంటే “Z” అక్షరం కొనసాగింపుపైనే అసదుద్ధీన్ ఒవైసీకి అభిమానం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.
ఎంతైనా “నిజాం సెంటిమెంట్” ను
ఆర్టీసీ శ్రామికుల ప్రాణం కంటే మిన్న"Z"అక్షరాన్ని చూడటం జరిగింది. అంటే ప్రజల కంటే
కేసీఆర్ కు మల్లే అసదుద్దీన్ ఒవైసీకు రాచరికంపైనే మక్కువ ఎక్కువని తేలిందని తెలంగాణా వాసులు భావిస్తున్నారు.