అభిమానులను కొడతాడు, బూతులు తిడతారు అంటూ బాలయ్య మీద కొంత నెగటివ్ కార్నర్ ఉండేది జనాల్లో. కానీ బాలయ్య మనసు వెన్న అని, అయన చాల ప్రేమగా ఉంటారని సన్నిహితులు చెబుతుంటారు.నిజమే అయన ప్రేమ, దయాగుణం ఇన్నాళ్లు పైకి కనిపించకపోయినా....ఇప్పుడు బాలయ్యలోని రియల్ హీరోని చూస్తున్నారు అభిమానులు.నందమూరి బాలకృష్ణ మీద ఎక్కువగా ట్రోలింగ్స్ కనిపిస్తూ ఉంటాయి.

కానీ, ఇప్పుడు బాలయ్యను పొగుడుతూ, ఆకాశానికి ఎత్తుతూ ట్వీట్లు కనిపిస్తు్న్నాయి. అనంతపురంలో బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న స్వప్నకు చేయూత లభించింది. తమ బిడ్డకు బసవతారకం ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందిస్తామని.. తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ హామీ ఇచ్చినట్లు స్వప్న కుటుంబ సభ్యులు తెలిపారు. బాలికతో, ఆమె తల్లి అరుణతో బాలకృష్ణ స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు.

వాళ్లకు ధైర్యం చెప్పారు. స్వప్నకు బసవతారకం హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. వెంటనే హైదరాబాద్‌కు బయలుదేరి రావాలని, ఆపరేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేయిస్తానని గౌస్‌మొయిద్దీన్‌కు ఫోన్‌లో బాలయ్య సూచించారు. ఫోన్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించినట్లు వివరించారు.అలాగే స్వప్నకు మరికొందరు దాతలు స్పందించి ఆర్థిక సహాయం చేశారు. జిల్లాలోని బుక్కరాయసముద్రం పరిధిలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు లక్షా 70 వేలు అందించారు.

ఇలా దాదాపు 3 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందాయి.తమకు అండగా నిలబడిన ప్రతిఒక్కరికీ స్వప్న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న యువతి స్వప్న దీన స్థితిపై ప్రముఖ  వరుస కథనాలు వచ్చాయి. పదో తరగతి వరకు చదువుకున్న స్వప్నకాలి నొప్పితో  ఆసుపత్రిలో చేరగా  పరీక్షించిన వైద్యులు ఎడమ మోకాలికి క్యాన్సర్‌ ఉందని తేల్చారు. మోకాలి భాగంలో ఉన్న క్యాన్సర్‌ గడ్డను ఆపరేషన్‌ చేసి తొలగిస్తే బతకడానికి అవకాశాలున్నాయనీ.. అందుకు రూ.6 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: