రాష్ట్ర విభజన అనంతరం రెవెన్యూ చట్టం లో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన మార్పులు రైతులకు ,అధికారులకు ఇబ్బందిగా మారాయని కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు జగ్గారెడ్డి అన్నారు . తెలంగాణ రెవెన్యూ చట్టం , రైతులకు ,అధికారులకు వెసులుబాటుగా ఉండేదని అన్నారు . నమస్తే తెలంగాణ దినపత్రికలో ..ధర్మగంట శీర్షిక పేరుతో ప్రచురించిన కథనాలు రైతులు ,అధికారులకు మధ్య వైరాన్ని పెంచిందని చెప్పారు . తహశీల్ధార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనపై జాగారెడ్డి మీడియా తో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ రెవెన్యూ అధికారులపై ధర్మ గంట ప్రజల్లో విషాన్ని నూరిపోసిందని అన్నారు.
ధర్మ గంట కారణంగాన్నే ప్రజల్లో రెవెన్యూ అధికారులపై ద్వేషం పెరిగిందని జగ్గారెడ్డి తెలిపారు . సీఎం రెవెన్యూ డిపార్ట్ మెంట్ పై వ్యవహరించిన తీరే ఎమ్మార్వో బలికి కారణమైందని జగ్గారెడ్డి పేర్కొన్నారు . లంచాన్ని అరికట్టడం ఏ నాయకునితో సాధ్యం కాదని , ఎమ్మార్వో మృతి ఘటనలో ఉద్యోగ సంఘాల నాయకుల తప్పుందని చెప్పారు . కేసీఆర్ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల గుడ్డిగా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వస్తున్నది నిజం కాదా ? అంటూ ప్రశ్నించారు . మంత్రులు శ్రీనివాస్ గౌడ్ , రాజేందర్ , ఉద్యోగ సంఘాల నేతలు రవీందర్ రెడ్డి , మమతలే ..ఎమ్మార్వో చావుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు . రైతు ఆవేశానికి ప్రభుత్వం విధానాలు .. ఎమ్మార్వో చావుకు ఉద్యోగ సంఘాలే తీరే కారణమంటూ మండిపడ్డారు .
ప్రభుత్వం ఇకనైనా మేల్కొవాలని .. అధికారులు ..ప్రజలకు మధ్య స్నేహపూర్వ వాతావరణం పెంచాలని సూచించారు . ప్రభుత్వం మేల్కొకోకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని జగ్గారెడ్డి హెచ్చరించారు . తహశీల్ధార్ ను కార్యాలయం లోనే ఒక ఆగంతకుడు పెట్రోలు పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది .