ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంత సమస్యతో ఢిల్లీకి వెళ్లారని విన్నాం కదా.... ఢిల్లీ దాకా పోవుడు దేనికి సారూ నేను ఓ మందు ఇస్తా మీ పళ్ళను ఇట్టే సరిచేస్తా అంటున్నాడు ఓ పెద్దాయన. మరి ఆ పెద్దాయన కధ ఏంటో తెలుసుకుందామా?తినే అన్నంలో మనకు ఎప్పుడైనా చిన్న రాయి పట్టికి తగిలితేనే ప్రాణం పోయినంత పనవుతుంది.శరీరంలోని నరాలు మొత్తం జీవ్వుమని లాగేస్తాయి.వెంటనే ఆ అన్నాన్ని చెత్తలో పడవేస్తాం.

అలాగే ఇప్పటికే ఉన్న పళ్ళ సమస్యలతో రకరకాల పేస్టులు వాడుతున్నాం.అలాంటిది ఓ వ్యక్తి మాత్రం ఏకంగా పలుగు రాళ్లనే పల్లీ, బఠాణీలు నమిలేసినట్లుగా పలుగు రాళ్లను పరపర నమిలి మింగేస్తున్నాడు.   ఇప్పుడు అతడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.  అతని పంటి పటుత్వానికి అతని దగ్గర ఓ సిక్రేట్‌ ఉందంటున్నాడు. కావాలంటే..సీఎం కేసీఆర్‌ పిలిస్తే…కూడా వస్తానంటూ సవాల్‌ విసురుతున్నాడు.


అవును ఇది నిజమే..సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలంలో గల రగువత్తం గ్రామంలో నివసిస్తున్నాడు పెద్ద సత్తిరెడ్డి అనే 70 ఏళ్ల వృద్ధుడు.తన పంటి పటుత్వానికి తనకు తెలిసిన ఓ మూలిక వైద్యం ఉందంటున్నాడు. కొద్ది రోజుల క్రితం తన దంతాలు వదులుగా మారిన ఇబ్బంది పడ్డానని, ఆ క్రమంలోనే తాను ఓ మూలికను కనుగొని తినటంతో తన పళ్లు పటిష్టంగా మారాయని చెబుతున్నాడు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా దంత సమస్యతో ఢిల్లీకి వెళ్లారని విన్నాను.

అంటున్న సత్తిరెడ్డి కోరితే..కేసీఆర్‌కు కూడా తన దగ్గరున్న మూలికను ఇస్తానని చెబుతున్నాడు. దంతాల బలానికి కారణమైన తన మూలిక మెడిసిన్‌పై యాడ్‌ ఇచ్చేందుకు కూడా తాను సిద్దంగా ఉన్నానని సవాల్‌ చేస్తున్నాడు. సత్తిరెడ్డి చేస్తున్న సవాల్‌ను గ్రామస్తులు సైతం అంగీకరిస్తున్నారు. తనకు గల అద్భుత ప్రతిభను ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: