ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఒక మహిళను దారుణంగా చంపేశాడు. పూర్తి వివరాలలోకి వెళితే ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని జాంబ్ గిర్ చంపా జిల్లాలోని ఒక గ్రామంలో అన్వర్ కుటుంబం నివశించేది. అన్వర్ తమ్ముడు జమీర్ కొన్ని నెలల క్రితం బిలాస్ పూర్ ప్రాంతంలోని ఒక కంపెనీలో పని చేశాడు. ఆ సమయంలో జమీర్ కు కుష్వాహాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్ని రోజులకు ప్రేమగా మారింది. 
 
జమీర్ కుష్వాహాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. జమీర్ కుష్వాహా శారీరకంగా దగ్గర కావటంతో పాటు కొంతకాలం సహజీవనం కూడా చేశారు. ఆ తరువాత జమీర్ తన తల్లిదండ్రులకు కుష్వాహాను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కానీ జమీర్ తల్లిదండ్రులు కుష్వాహాతో వివాహానికి అంగీకరించలేదు. జమీర్ కు మరో మంచి సంబంధం చూసి జమీర్ ను ఒప్పించి పెళ్లి చేశారు. 
 
జమీర్ కు పెళ్లైన విషయం కుష్వాహాకు తెలిసింది. కుష్వాహా జమీర్ మోసం చేసాడని చాలా బాధ పడింది. నన్ను ఎందుకు పెళ్లి పేరుతో మోసం చేసావని కుష్వాహా జమీర్ ను నిలదీసింది. జమీర్ మాత్రం నాకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని కానీ కుటుంబ సభ్యులు బలవంతం చేయటంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని  చెప్పాడు. 
 
కొన్ని రోజుల తరువాత కుష్వాహా జమీర్ ను కలవడానికి అతని ఇంటికి వెళ్లింది. కానీ కుష్వాహా జమీర్ ఇంటికి వెళ్లిన సమయంలో జమీర్ ఇంట్లో లేడు. కుష్వాహా జమీర్ అన్న అన్వర్ తో బలవంతంగా జమీర్ కు ఎందుకు పెళ్లి చేశారని గొడవ పెట్టుకుంది. ఇద్దరి మధ్య కొంత సమయం గొడవ జరిగింది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అన్వర్ ఒక పెద్ద రాయిని తీసుకొని కుష్వాహా తలపై కొట్టాడు. కుష్వాహా చనిపోవటంతో ఆమె మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో దహనం చేశాడు. కుష్వాహా కనిపించటం లేదని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటంతో పోలీసుల విచారణలో కుష్వాహాను అన్వర్ చంపాడని తెలిసింది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: