మహారాష్ట్ర రాజకీయాలు కీలకమైన మలుపులు తీసుకుంటున్నాయి.
బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని స్పష్టం చేయటంతో మహరాష్ట్ర రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈరోజు ఉదయం పది గంటలకు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఈరోజు ఉదయం 11గంటలకు
శరద్ పవార్ అధ్యక్షతన భేటీ మొదలైంది.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయం మేరకు మహారాష్ట్రలో నడుచుకుంటామని అన్నారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్న సమయంలో
కాంగ్రెస్ పార్టీ నేత సంజయ్ నిరుపమ్
మహారాష్ట్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా అస్థిరతకు మాత్రం తెరపడదని అన్నారు.సంజయ్ నిరుపమ్
2020 సంవత్సరంలో తిరిగి ఎన్నికలు జరగొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు
శివసేన శాసన సభాపక్ష నేత ఏక్ నాథ్ షిండే
గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరనున్నారు.