టీఎస్
ఆర్టీసి సమ్మె రోజులు గడిచే కొద్దీ ఉద్రిక్తం గా మారుతోంది తాజా గా
ఆర్టీసి కండక్టర్ బలవన్మరణం చెందాడు. హైకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందోనని మనస్తాపానికి గురైన ఓ డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృతుడు
నరేష్ 2007 నుంచి
ఆర్టీసీ లో
కండక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరేశ్ మృతిచెందాడు.మృతునికి
భార్య ఇద్దరు పిల్లలు వున్నారు.
డ్రైవర్ నరేశ్ మృతదేహంతో కార్మికులు, నేతలు ర్యాలీ చేపట్టారు.. ఆస్పత్రి నుంచి బస్సు డిపో వరకు ర్యాలీ చేపట్టి అనంతరం డిపోలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బస్సు డిపో ఎదుట వారు ధర్నాకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మృతుని
భార్య గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమె మందులకు నెలకు సుమారు రూ.5 వేలు ఖర్చవుతున్నాయనీ.. మరోవైపు పిల్లల చదువుతో నరేశ్ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. నరేశ్ ఆత్మహత్య వార్త తెలుసుకున్న కార్మికులు, అఖిలపక్ష పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివచ్చారు. ఇక
తెలంగాణ ప్రభుత్వం
ఆర్టీసీ కార్మికులపై వ్యవహారిస్తున్న తీరు పై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రోజుకొక
ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు
ఆర్టీసీ సమ్మె పై హై కోర్టు లో విచారణ వున్న సందర్బం లో
ఆర్టీసి కార్మికుడి
హత్య చేసుకున్నందున పరిస్థితి ఉద్రిక్తం గా మారింది.