తెలంగాణ రాష్ట్రం వస్తే ఆత్మహత్యలు ఉండవని సీఎం
కేసీఆర్ పలు సందర్భాలలో చెప్పారని కానీ ప్రస్తుతం
తెలంగాణ లో రైతుల ఆత్మహత్యలు ఒకవైపు ,ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు మరొక వైపు కొనసాగుతున్నాయని
సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు
జయప్రకాష్ రెడ్డి అన్నారు .
ఆర్టీసీ చరిత్ర లో 40 రోజులు పాటు
సమ్మె జరగడం ఇదే మొదటి సారన్న ఆయన , పొరుగు రాష్ట్రం లో
ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయడంతో , తెలంగాణలోనూ
ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ తో కార్మికులు
సమ్మె చేస్తున్నారన్నారు.
ప్రభుత్వ వైఖరి చూస్తుంటే , ఇంకా ఎన్నిరోజులు
సమ్మె జరుగుతుందో తెలియడం లేదన్నారు . ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సమస్య పరిష్కారానికి చొరవ చూపించకపోవడం విస్మయాన్ని కలుగజేస్తోందని జగ్గారెడ్డి అన్నారు . తక్కువ జీతాలు ఉన్న
ఆర్టీసీ కార్మికులు అనారోగ్యకారణలతో ఇబ్బందులు పడుతున్నారని , ఆవుల
నరేష్ అనే
ఆర్టీసీ కార్మికుడు బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు . మన
ముఖ్యమంత్రి పరిపాలనలో ఇంతమంది
ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటుంటే, ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు . ఉద్యమాలతో సాధించుకున్న రాష్ట్రంలో, ఉద్యమాలకే విలువలేకుండా పోయిందని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు .
కళ్ళుండి చూడలేని గుడ్డి ప్రభుత్వం, ఇది అంటూ మండిపడిన అయన , చనిపోయిన కార్మికులను ఎవరు ఆదుకోవాలంటూ ప్రశ్నించారు . చనిపోయిన కార్మికుల కుటుంబాలను
ఆర్టీసీ అధికారులు ఆదుకునే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు . బలహీనుడికి బలవంతునికి జరుగుతున్న పోరాటం...భగవంతుడు ఎవరిని గెలిపిస్తాడో చూద్దామన్నా జగ్గారెడ్డి , బంగారు
తెలంగాణ చేస్తామన్న టీఆరెస్ సర్కార్ , రాష్ట్రాన్ని ఆత్మహత్యల
తెలంగాణ గా మార్చిందని ధ్వజమెత్తారు .