జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు విరుచుకు పడ్డాడు. మొన్న తాజాగా పవన్ కళ్యాణ్  వైసీ జగన్ పై కాలు దువ్విన సంగతి తెలిసిందే.. కాగా ఈ విషయం పై చర్చలు బాగానే జోరుగా చర్చలు సాగిన విషయం తెలిసిందే. అయితే, స్థాయిలు మర్చిపోయి ఒకరి మీద మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. టీడీపీకి పవన్ కొమ్ముకాస్తున్నాడని వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. 


పవన్ కళ్యాణ్ ను వ్యక్తి గత విషయాలను ఇక్కడకు లాగొద్దను చెప్పిన పవన్.. వైసీపీ నేత సీఎం జగన్ మోహన్ రెడ్డి, విజయ సాయి రెడ్డి పై మాత్రం విమర్శలు గుప్పించాచునా అంటూ అంబటి ప్రశ్నించారు. పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారని అడిగితే మీరు కూడా చేసుకోండని చెప్పడమేంటో తనకి అర్థం కావడం లేదంటూ అంబటి సెటైర్లు వేశారు. కనీసం ఇంగితజ్ఞానం ఉండాలంటూ ఘాటుగా విమర్శించారు.


విమర్శలు చేస్తేనే మంత్రి పదవి వస్తుందన్న పవన్ మాటలు అంబటి రాంబాబు భాద పెట్టాయని అయన వెల్లడించారు. బొత్స కు పదవి వచ్చింది నీకు రాలేదు అంటూ అన్న పవన్ మాటలు మింగుడు పడటం లేదని ఆయన అన్నారు. తనకు మంత్రి పదవి విషయం పార్టీ చూసుకుంటుందని.. కానీ రోజూ విమర్శలు చేసే పవన్ కళ్యాణ్‌కి ప్యాకేజీలు ఎవరిస్తున్నారో చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. ఆ తెనాలి


బాబు.. లింగమనేని సాయంతో చంద్రబాబుతో బేరాలు కుదుర్చుకున్న సంగతి నిజం కాదా? అని నిలదీశారు.
ఇకపోతే పార్టీని సొంతంగా నడుపుకుంటే బాగుండేది.. అందరిని భాద పెట్టారు పవన్ కళ్యాణ్ అంటూ అంబటి అన్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన కూడా బాబు గారి కోసమే వెళ్లాడని అంబటి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్లాడని తాను అనుకోవడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ నేతలు చంద్రబాబును రానివ్వరు కాబట్టి.. ఎవరి కోసం వెళ్లి ఉంటాడో అని అంబటి ఎద్దవా చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: