స‌మాజంలో రోజురోజుకు దుర్మార్గం పెరుగుతోంది..మాన‌వ‌త్వం మంట‌గ‌లుస్తోంది..మ‌నిషిత‌త్వం చ‌చ్చిపోతోంది...మ‌నిషి రూపంలోనే రాక్ష‌సులు ఉంటార‌నే నిరూపించే సంఘ‌ట‌న‌లు రోజూ గుర్తు చేస్తున్నాయి. ఇందుకు నిద‌ర్శ‌న‌మే గుంటూరులో ఇటీవ‌ల జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌....వందేళ్లు నీకు తోడు నీడ‌గా న‌డుస్తాన‌ని...పెళ్లి బంధంతో భార్య‌ను  ఏడడుగులు న‌డిపించుకూ వ‌చ్చిన భ‌ర్తే ఆమెను న‌ర‌కం చూపించాడు. 


అంత‌కు మించిన మాన‌సిక వ్య‌థ‌ను..క్షోభ‌ను మిగిల్చాడు. వాడిలోని ఉగ్ర రాక్ష‌స‌త్వాన్ని ఊహించ‌ని ఆ బాధితురాలు....త‌న జీవితం నాశ‌న‌మైంద‌ని విల‌పిస్తోంది. గుంటూరు జిల్లా శ్రీనివాస‌రావుపేట‌కు చెందిన దంప‌తులు త‌మ పెద్ద కుమార్తెను తాడికొండ‌కు చెందిన ఓవ్య‌క్తికి  ఇచ్చి 2017లొ వివాహం జ‌రిపించారు. పెళ్లైన కొత్త‌లో బాగానే ఉన్నా అత‌ను రోజులు గ‌డిచినా కొద్దీ త‌న‌లోని రాక్ష‌సుడిని మేల‌కోలిపాడు.. అద‌న‌పు క‌ట్నం తీసుకురావాల‌ని వేధించేవాడు. అనేక మార్లు చిత్ర హింస‌లు పెట్టాడు. 


త‌మ త‌ల్లిదండ్రులు చాలా క‌ష్టాల్లో ఉన్నార‌ని వారి నుంచి అద‌న‌పు క‌ట్నం తీసుకురాలేన‌ని వేడుకుంది. అయినా ఆ రాక్ష‌సుడు విన‌లేదు. ఇలా అయితే ప‌ని కాద‌ని...భార్య స్నానం చేస్తుండ‌గా వీడియో తీసి అద‌న‌పు క‌ట్నం తీసుకురాకుంటే ఈ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పెడుతానంటూ వేధించ‌డం మొద‌లు పెట్టాడు. వెంట‌నే పుట్టింటికి వెళ్లి తాను చెప్పినంత డ‌బ్బును తీసుకురావాల‌ని అంటూ గ‌డువు విధించాడు. ఎన్నో రోజులుగా ఆ భార్య ఈ బాధ‌ను ఎవ్వ‌రికి చెప్పుకోలేక త‌న‌లో తానే కుమిలి పోయింది. చివ‌ర‌కు వేధింపులు తీవ్రం కావ‌డంతో త‌ట్టుకోలేక పోయింది.


చేసేదేమీ లేక కొండంత బాధ‌ను గుండెల్లో దిగ‌మింగుకుని..క‌న్నీటితో పుట్టింటికి చేరింది. ఆక‌స్మాత్తుగా కూతురు ఇంటికి రావ‌డంతో ఆ త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న మొద‌లైంది. మెల్ల‌గా జ‌రిగిన విష‌య‌మంతా బాధితురాలు త‌ల్లిదండ్రుల‌కు వివ‌రించ‌డంతో వారి నిశ్చేష్టుల‌య్యారు.  కోపోద్రుక్తులైన వారు..కూతురును తీసుకుని వెళ్లి స్థానిక పోలీస్‌స్టేష‌న్‌లో ఆమె చేత ఫిర్యాదు చేయించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి విచారిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: