ఆంధ్రాలో కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ వాట్సాప్‌లో చంద్రబాబుకు పంపిన సంగతి అందరికి తెలిసిందే కదా. కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటే శాసనసభాపతికి రాజీనామా పత్రం ఇవ్వాలి.  ఇంత వరకు శాసనసభ సభాపతికి స్వయంగా కలిసి రాజీనామా లేఖను ఇస్తానని వంశీ తెలియచేసిందే లేదు అసలు. తాను ప్రజలలో పట్టున్న నాయకుడునని, ఏ పార్టీ అభ్యర్ధిగా అయినా విజయం సాధిస్తానని, స్వతంత్రం అభ్యర్ధిగా అయినా విజయం సాధించగల సత్తా తనకు ఉందని అని ఎమ్మెల్యే వంశీ ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆయన మాటలలో ఉన్న తొందర ఆయన చేతలలో అసలు కనిపించటం  లేదు అని తెలుస్తుంది.

 

ఇప్పటకే  ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీలోకి చేరితే వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తానని శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం తెలియచేయడం కూడా జరిగింది. అసలు విషయం ఏమిటంటే.. ఎమెల్యే పదవికి రాజీనామా చేశాక ఆమోదిస్తే మళ్లీ ఉప ఎన్నికలు నిరవహించ వలసి ఉంటుంది. అప్పుడు పోటీ చేసే అవకాశం జగన్‌ కల్పించినా ఎన్నికలలో విజయం సాధిస్తే అంత బాగుంటుంది. కానీ  ఒక వేళ గెలుపు సొంతం చేసుకోకపోతే  వల్లభనేని వంశీ రాజకీయ జీవితం అంతటితో ముగుస్తుందని ఆయనకు పలు అనుమానలు వస్తున్నాయి. 

 

గన్నవరం నియోజకవర్గంలో గత నలభై ఏళ్లలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ది 1989లో మాత్రమే విజయం సాధించగా, మరో సారి స్వతంత్ర అభ్యర్ధి (తెలుగుదేశం రెబల్‌) విజయం సాధించడం జరిగింది. ఈ రెండు దఫాలు మినహా మిగతా అన్ని సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్దులు విజయం సొంతం చేసుకుంటేనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికలలో స్వల్ప మెజార్టీతో వంశీ వైఎస్సార్‌సిపి పార్టీ అభ్యర్ధి పై విజయం సొంతం చేసుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: