నిత్యానంద స్వామికి సంబంధించిన రాసలీలలు గతంలో బయటపడిన సంగతి తెలిసిందే.  ఈ రాసలీలల కారణంగా అయన పరపతి దారుణంగా మారిపోయింది.  సినీ నటితో రొమాన్స్ చేస్తున్న వీడియో బయటకు రావడంతో.. ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.  ఈ వీడియో బయటకు వచ్చిన తరువాత నిత్యానంద స్వామీ ఎస్కేప్ అయ్యాడు.  ఎస్కేప్ కావడమే కాదు.. ఎక్కడ ఉన్నాడో చాలా రోజుల వరకు ఎవరికీ తెలియలేదు.  


కొంతకాలం తరువాత ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండగా ఆయన్ను పోలీసులు పట్టుకున్నారు.  ఇదంతా గడిచిపోయిన చరిత్ర.  తరువాత మొత్తం మారిపోయింది.  నిత్యానందుడు తిరిగి తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు.  అయితే, ఇప్పుడు మరలా అయన చుట్టూ రాసలీలల కేసు చుట్టుకుంది.  అహ్మదాబాద్ లోని ఆశ్రమంలో నిత్యానందుడు ఇద్దరు అమ్మాయిలను నిర్బందించాడని, ఆ ఇద్దరు యువతలు తండ్రి  జనార్దన శర్మ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. .  


అహ్మదాబాద్ హైకోర్టు ఈ కేసును విచారిస్తోంది. నిత్యానంద స్వామి కోసం పోలీసులు వెతుకుతున్నారు.  అంతేకాదు, అక్కడ ఆశ్రమంలో ఉన్న అమ్మాయిల లిస్ట్ ను పోలీసులు ఆరాతీస్తున్నారు.  ఈకేసు కోర్టు మెట్లు ఎక్కుతున్న సమయంలో నిత్యానంద స్వామి ఓ వీడియోను రిలీజ్ చేశారు.  తన చుట్టూ ఎన్నో ఆరోపణలు వచ్చాయని, అలాంటి ఆరోపణలు వస్తున్న సమయంలో అహ్మదాబాద్ భక్తులు తనకు అండగా నిలిచారని, ఇలా అండగా నిలిచి తనను ఎంతగానో ఆడుకున్నారని పేర్కొన్నారు.  


ఇక ఆశ్రమంలో ఎవర్ని తాను నిర్బందించలేదని, పిల్లలను తల్లిదండ్రులు కలవొచ్చని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిత్యానంద స్వామీ వీడియోద్వారా పేర్కొన్నారు.  ఇక పిల్లలు వచ్చిన వాళ్ళను కలవాలా వద్దా అన్నది వారి ఇష్టప్రకారమే ఉంటుందని అయన చెప్పుకొచ్చారు.  జనార్ధన శర్మ హైకోర్టులో వేసిన పిటిషన్ ఈరోజు విచారణకు రాబోతున్నది.  జనార్ధన శర్మ వెర్షన్ ప్రకారం తన నలుగురు కుమార్తెలను 2013లో నిత్యానందస్వామి ఆశ్రమంలో చేర్పించానని, తమను సంప్రదించకుండానే నిత్యానంద స్వామి తన పిల్లలను బెంగళూరు నుంచి అహ్మదాబాద్ లోని మరో సంస్థకు తరలించాలని పిటిషన్లో పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: