బాలిక‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. రోజుకోచోట బాలిక‌ల‌పై అత్య‌చారాలు జ‌రుగుతున్నాయి. ఈ విష‌యంలో ఎన్ని చ‌ట్టాలు ఉన్నా.. పోలీసులు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా... కామాంధులు మాత్రం ఆగ‌డం లేదు. బాలిక‌లు, మైన‌ర్లు, యువ‌తులు, పెళ్ల‌యిన వారు అని చూడ‌కుండా త‌మ కోరిక‌ల కోసం వారిని వాడేసుకుంటున్నారు. తాజాగా  గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బాలికను మాయమాటలతో లొంగదీసుకున్న వెటర్నరీ డాక్టర్ శివనాయక్‌ అమెపై పలుమార్లు అత్యాచారం జ‌రిపిన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

 

కొంత‌కాలం క్రితం శివ‌నాయ‌క్ బాలిక‌కు ప‌రిచ‌య‌మైంది. ప‌రిచ‌యం ఏర్ప‌డిన నాటి నుంచే ఆమెపై క‌న్నేశాడు. బాలికను బుట్ట‌ల వేసుకునేందుకు ఆమెకు కావాల్సిన వ‌స్తువుల‌ను కొనిస్తూ వ‌చ్చాడు. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మ‌బ‌లికాడు. వైద్యుడు శివ‌నాయ‌క్ మాట‌లు న‌మ్మిన బాలికకు ఇష్టం లేక‌పోయినా త‌న గ‌దికి తీసుకెళ్లేవాడు. ఈ విష‌యం మ‌న‌మ‌ధ్య‌మే ఉండాల‌ని, ఇరు కుంటుబాల్లోనూ తానే చెబుతాన‌ని అప్పటి వ‌ర‌కు ఇద్ద‌రం ప్రేమించుకుంటున్న విష‌యం మ‌రోక‌రికి తెలియ‌వ‌ద్ద‌ని సూచించాడు.

 

బాలిక కూడా అదే విధంగా చేసింది. అయితే ఇటీవ‌ల అనారోగ్యానికి గురికావ‌డంతో మ‌రో వైద్యుడి వ‌ద్ద‌కు తీసుకెళ్లింది. తీవ్ర‌జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న ఆమెను జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని సూచించారు. బాలిక త‌న‌కేదో అయిందోన‌న్న ఆందోళ‌న‌తో అస‌లు విష‌యం త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌డంతో వారు నిర్ఘాంత‌పోయారు. ఆగ్ర‌హావేశాల‌కు గురైన వారు కుటుంబ స‌భ్యుల సూచ‌న‌ల‌తో పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

 

తమ కూతురిని శివనాయక్ మాయమాటలతో లొంగదీసుకుని అత్యాచారం చేశాడని బాలిక తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేర‌కు కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాక్టర్‌ దుర్మార్గంపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం  శివ‌నాయ‌క్ పోలీసుల అదుపులో ఉన్నాడు. శివనాయక్ ఇంకా ఎవరినైనా ఇదే విధంగా మోసం చేశాడా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తుండ‌టం గ‌మ‌నార్హం. బాలిక‌ను సైతం విచారించాల‌ని పోలీసులు భావిస్తున్నారని స‌మాచారం. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: