దేవినేని ఉమామహేశ్వరరావు.. మాజీ మంత్రి.. తెలుగుదేశం సర్కారు హయాంలో ఒక వెలుగు వెలిగాడు. చంద్రబాబు కూడా ఆయనకు ప్రయారిటీ ఇచ్చి జలవనరుల శాఖ అప్పగించారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయిందా.. చంద్రబాబు కూడా దేవినేనిని పక్కకు పెట్టేశారా.. అందుకే మొన్నటి ఇసుక దీక్షలో దేవినేనికి చంద్రబాబు పక్కన స్థానం దక్కలేదా.. అవునంటున్నారు కొందరు వైసీపీ నాయకులు.

 

దేవినేని ఉమా ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడని.. అతని ప్రవర్తనతో చంద్రబాబునే కాకుండా ఆఖరికి అతని తండ్రిని కూడా తిట్టించుకునే పరిస్థితికి దేవినేని ఉమ దిగజారిపోయాడని వైసీపీ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ అన్నారు. దేవినేని ఉమను ప్రజలు గెంటేశారు.. టీడీపీ ఒక పక్కకు నెట్టేసిందన్నారు. అందుకే చంద్రబాబు చేసిన ఇసుక దీక్ష వేదికపై కూర్చుంటే కిందకు తోసేశారన్నారు.

 

ప్రజలు చిత్తుగా ఓడించిన దేవినేని ఉమకు ఇంకా బుద్ధిరాలేదన్నారు. పొంతన లేకుండా మాట్లాడుతూ ప్రజల చేత రోజూ తిట్టించుకుంటున్నాడన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో పోలవరం వెనుకబడి పోయిందని దేవినేని ఉమ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని, కృష్ణా, గోదావరి జలాలు పారుతుంటే ఇసుక ఎలా తీస్తారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కలల స్వప్నమని, ఆయన కుమారుడు సీఎం వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు.

 

రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా వందల కోట్ల రూపాయలు ఆదా చేశామన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.. పోలవరం త్వరలోనే పూర్తిచేస్తామని వసంత కృష్ణప్రసాద్‌ అన్నారు. దేవినేని ఉమ 2018 కల్లా పూర్తి చేస్తాం.. రాసుకో అని మాట్లాడాడని, ఎంతమేర పూర్తిచేశారని ప్రశ్నించారు. పోలవరం సోమవారం అని చెప్పి చంద్రబాబు, దేవినేని ఉమ ముడుపులు తీసుకున్నారన్నారు. నచ్చిన వారిని, టీడీపీ కార్యకర్తలను వేలాది బస్సుల్లో పోలవరం సందర్శనకు తీసుకెళ్లి వందల కోట్లు దుర్వినియోగం చేశారని వసంత కృష్ణప్రసాద్‌ మండిపడ్డారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: