భూమా నాగిరెడ్డి చనిపోయినప్పటి నుండి భూమా వర్గియిల్లో అంతర్ విభేదాలు రావడం మొదలయింది.దగ్గరగా ఉన్న వాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు దూరం అవుతూ వచ్చారు ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేసినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.
హైదరాబాద్లోని ఓ భూమికి సంబంధించిన వివాదంలో ఇద్దరు అక్కలు అఖిలప్రియ, మౌనికారెడ్డిలతో పాటూ మరికొందర్ని ప్రతివాదులుగా చేరుస్తూ.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలొచ్చాయి. మాజీ మంత్రి భూమా నాగిరెడ్డి భార్య శోభానాగిరెడ్డి పేరుతో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంమంచిరేవులలో స్థలం ఉండేదని.. 2014లో శోభానాగిరెడ్డి మరణం తర్వాత 2016లో ఆ భూమిని భూమా నాగిరెడ్డి రూ.2 కోట్లకు విక్రయించారట. భూమిని అమ్మే సమయంలో భూమా నాగిరెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు అఖిలప్రియారెడ్డి, మౌనికారెడ్డితో కూడా సంతకాలు చేయించారు. తనయుడు జగత్విఖ్యాత్రెడ్డి మైనర్ కావడంతో.. వేలిముద్ర వేయించారట.
ఇప్పుడు జగత్ విఖ్యాత్ ఆ భూమిపై కోర్టులో పిటిషన్ వేసినట్లు వార్తలొచ్చాయి. భూమి అమ్మే సమయానికి తాను మైనర్నని.. తనకేమీ తెలియని వయసులో తండ్రితో పాటు అక్కలిద్దరూ భూమని విక్రయించారని ఆరోపించారట. ఆ భూమిలో తన వాటా కావాలని పిటిషన్ దాఖలు చేశారు. తన అక్కలైన అఖిలప్రియ, మౌనికల్ని ప్రతివాదులగా చేర్చారు. అక్కలతో పాటు భూమిని కొనుగోలు చేసిన మరికొందర్ని ప్రతివాదులుగా చేర్చినట్లు తెలిసింది.
ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్టాపిక్గా మారిందిదీనిపై జగత్ విఖ్యాత్ రెడ్డి స్పందించారు.. తాను ప్రస్తుతం దుబాయ్లో ఉన్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు. తమ కుటుంబం అంతా కలిసే ఉందని.. తమపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.జగత్ విఖ్యాత్ వీడియోలో ‘నమస్కారం.. మీడియాలో నేను ఏవో కేసులు వేశారని..ప్రచారం జరిగాయి. తాను దుబాయ్లో ఉండటంతో అందుబాటులోకి రాలేకపోతున్నాను.
అందుకే వీడియో ద్వారా చెబుతున్నా.. మీడియాలో వచ్చే ప్రచారాలు నమ్మొద్దు.. అవన్నీ అవాస్తవాలు. మేము అంతా కలిసి ఉన్నాం.రేపు భూమా కేడర్, భూమా కుటుంబాన్ని ఎలా బలపరచాలో ఆలోచిస్తాం తప్ప.. మచ్చ వచ్చేలా ప్రవర్తించం’అన్నారు.కోర్టులో పిటిషన్ వ్యవహారం గురించి మీడియాలో కథనాలు రావడంతో జగత్ విఖ్యాత్ స్పందించారు.
తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం భూమా అఖిలప్రియను భర్త భార్గవ్ రామ్ కేసులు వివాదం వెంటాడింది.. హైదరాబాద్లో కూడా భార్గవ్పై ఓ కేసు నమోదయ్యింది. ఇప్పుడు తాజాగా సొంత తమ్ముడు కోర్టుకు ఎక్కాడన్న వార్తలు హాట్టాపిక్ అయ్యింది.